-
కొత్త ఎక్సీడ్ లగ్జరీ స్పోర్ట్స్కారు.. అదిరిపోయే ఫొటోలు
-
అభివృద్ధి చెందే రంగాలు ఇవే.. నిర్మలా సీతారామన్
ఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని 'నరేంద్ర మోదీ' గతంలో చాలా సార్లు చెబుతూనే వచ్చారు. ఈ విషయం మీద కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరు ప్రధానమంత్రి అయినా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చిదంబరం అన్నారు. ఈ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. 2004 - 2014 మధ్య జీడీపీ కేవలం రెండు ర్యాంకులు మాత్రమే పెరిగిందని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సభలో వెల్లడించారు.2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో కేవలం రెండు ర్యాంకులు జీడీపీ పెంచింది. ఆ తరువాత పదేళ్ల మోదీ పాలనలో జీడీపీ ఐదు ర్యాంకులకు ఎగబాకింది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే.. తప్పకుండా జేడీపీ మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆర్ధిక వ్యవస్థ 2014కు ముందు బాగా తగ్గింది. చెడు విధానాలు, భారీ అవినీతి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుతుంది. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సీతారామన్ అన్నారు.భారతదేశంలో ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉందనే విషయాలను నిర్మల సీతారామన్ వివరించారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పునరుత్పాదక వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్రో-ప్రాసెసింగ్ రంగాలు మరింత అభివృద్ధి మార్గంలో నడుస్తాయని స్పష్టం చేశారు. -
రోజుకి 20 నిమిషాలే పనిచేస్తాడు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 3.8 కోట్లు..!
చాలామంది గంటలకొద్ది పనిచేసిన సంపాదన మాత్రం అతంత మాత్రంగానే ఉంటుంది. ఇంకొందరూ పడే కష్టం చూస్తే బాధేస్తుంది. వాళ్ల సంపాదన కనీసం రోజు గడవడానికి కూడా సరిపోదు. కానీ ఈ వ్యక్తి రోజుకి మహా అయితే 20 నిమిషాలకు మించి పనిచేయడు. కానీ ఏడాదికి ఏకంగా రూ. 3.8 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎలా? అతడి విజయ రహస్యం ఏంటీ అంటే.. ఓర్లాండ్ నివాసి ప్రాన్సిస్కో రివెరా ఫిబ్రవరి 2023లో ఆన్లోన్ ట్యూటర్గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ, మరోవైపు పాఠశాలలో టీచర్గా పనిచేసేవాడు. అయితే అది అతనికి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రోజంతా కష్టపడ్డా సంపాదిస్తుంది ఎంత అనే ఫీల్తో ఉండేవాడు. ఏదైన ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం కోసం తెగ అన్వేషించేవాడు రివెరా. అలా యూట్యూబ్లో బిజినెస్కి సంబంధించిన ప్రింట్ ఆన్ డిమాండ్(పీవోడీ) సైడ్ హాస్లర్ యూట్యూబ్ వీడియోలతో ప్రేరణ పొంది ఆర్గానిక్ క్యాండిల్స్ తయారు చేసి విక్రయించే ఎట్సీ((Eassiest Way To Start(Ety)) అనే దుకాణాన్ని పెట్టానలుకున్నాడు. ముదుగా ఆర్గానిక్ కొవ్వుత్తులు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆన్లైన్లో ఎలా విక్రయించాలి, ఎలా ప్రొడక్ట్లని డిజైన్ చేయడం అనేవి ఆ పీవోడీ వీడియోల ద్వారా పూర్తి పరిజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆన్లైన్లో కూడా బిజినెస్ బాగా విస్తరించేలా చేశాడు. ఇలా అతడి ఎట్సీ దుకాణం గతేడాది సుమారు రూ. 3.8 కోట్లు లాభాలు అందుకుంది. ప్రతి అమ్మకంలో దాదాపు 30% నుంచి 50% లాభలను అందుకున్నామని రివెరా చెప్పుకొచ్చాడు. తాను కేవలం మార్కెటింగ్కి, ప్రింట్ఫై సేవల కోసమే ఖర్చు చేస్తున్నాని తెలిపారు. తాను కొన్ని రోజులు 20 నిమిషాలే పనిచేస్తానని, ఒక్కోసారి మాత్రం రెండు గంటల వరకు పని చేస్తానని అది కూడా కొత్త ట్రెండ్స్పై పరిశోధన చేయడం, లేబుల్స్ డిజైన్ చేయడానికి ఇంత టైం పడుతుందని చెప్పుకొచ్చారు. మిగిలిన సమయం అంతా సంగీతంపై దృష్టి పెడతానని అన్నారు. తానిప్పుడూ గతంలో కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, తక్కువే పనిచేస్తున్నానని ఆనందంగా చెప్పుకొచ్చారు రివెరా. అంతేగాదు మీరు 9 టు 5 జాబ్లో ఉండి సరైన సంపాదన లేనప్పుడూ మంచి ఆదాయమార్గం వైపు దృష్టిసారించడం ఓ స్టాండర్డ్ని తీసుకోవడం చేయాలి చెబుతున్నాడు రివెరా. కాగా ప్రింట్ ఆన్ డిమాండ్(పీవోడీ) సైడ్ హాస్టల్స్ కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవాళ్లకు ఎలాంటి వ్యాపారాలు చేస్తే మంచిది, ఎలా ప్రారంభించాలి, ట్రైనింగ్ వంటివి అన్ని ఔత్సాహికులకు నేర్పించే యూట్యూబ్ ఛానెల్. ఆయా వ్యక్తులకు వ్యాపారానికి కావాల్సిన గైడన్స్ ఇవ్వడమే గాక మార్కెటింగ్ సంబంధించిన సహాయసహకారాలు కూడా అందిస్తుంది. దీని సాయంతో ఎంతో మంది ఈజీగా ఆదాయాన్ని గడించి బిజినెస్లతో దూసుకుపోయిన వారెందురో ఉన్నారు కూడా. (చదవండి: ఆ మూడు సమయాల్లో అస్సలు బ్రష్ చేయకూడదట..!) -
విస్తరణ బాటలో పోల్మోర్ స్టీల్.. ఆనందంలో పోలాండ్ రాయబారి
హైదరాబాద్: పోల్మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ రైల్వే కంపెనీలకు కీలకమైన విడిభాగాలు తయారుచేసి ఇచ్చే సంస్థ. ఈ కంపెనీ తెలంగాణలో భారీగా విస్తరించి, దీని ద్వారా ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్దమవుతోంది. మెదక్ జిల్లాలోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆటోమోటివ్ పార్కులో ఉన్న ఈ సంస్థ వృద్ధి బాటలో కొనసాగుతోంది. భారతదేశంలో పోలాండ్ రాయబారి డాక్టర్ సెబాస్టియన్ డొమ్జల్స్కి ఈ ప్లాంటును గురువారం సందర్శించారు. ఆయనతో పాటు పోలండ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అలెక్సాండర్ దండా, పోలాండ్ రాయబార కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాల కౌన్సెలర్ పావెల్ మోక్ర్జైకి, పొల్మోర్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు కూడా ఉన్నారు. ఈ బృందం ఇప్పుడున్న ప్లాంటుతో పాటు నిర్మాణంలో ఉన్న రెండో ప్లాంటునూ సందర్శించింది. భారతదేశంలో ఒక పోలాండ్ కంపెనీ సాధిస్తున్న వృద్ధిని చూసి రాయబారి డొమ్జల్స్కీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు పోల్మోర్ స్టీల్ను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న మేకిన్ ఇండియా విధానానికి అనుగుణంగా సాగుతున్న ఈ కంపెనీ తన విజయాలను మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. తమ సంస్థ విస్తరణ వ్యూహాల గురించి పోల్మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు మాట్లాడుతూ.. “భారతదేశంలో పలు యూరోపియన్ కంపెనీలు ఉన్నాయి. అదే బాటలో పోల్మోర్ స్టీల్ మరింతగా విస్తరించనుందని గర్వంగా చెబుతున్నాం. మరో మూడు ఎకరాల భూమి తీసుకుని 2.5 మిలియన్ యూరోల పెట్టుబడి కూడా సంపాదించి, అదనంగా మరో వంద మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. అంతే కాకుండా.. పోలాండ్లోని మాతృసంస్థలో కూడా 30 మంది పోల్మోర్ స్టీల్ ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్లి పనిచేస్తున్నారు. దీనివల్ల మనవాళ్లు యూరప్ వెళ్లి అక్కడ నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు యూరోపియన్ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారుచేయడానికి వీలవుతోంది” అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ఐఐసీలతో పాటు, వివిధ వర్గాల నుంచి అందుతున్న అపార మద్దతు పట్ల సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్లాంటుకు వచ్చి తమను ప్రోత్సహించినందుకు రాయబారికి, కాన్సుల్ జనరల్కు, ఆర్థిక కౌన్సెలర్కు ధన్యవాదాలు తెలిపారు. -
సముద్రం అంచున విమానం ఇల్లు.. అదిరిపోయే ఫొటోలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement