-
కన్నప్పకి బై బై
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైన షెడ్యూల్లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్ కుమార్గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్. -
రెండో పెళ్లి.. ఇప్పటికీ విడిగానే.. యానివర్సరీ మాత్రం గొప్పగా
ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి మనసులు కలిశాయంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని దాటి మరీ ఒక్కటయ్యేందుకు రెడీ అయిపోతారు. బాలీవుడ్ సీనియర్ జంట ధర్మేంద్ర- హేమమాలిని విషయంలో ఇదే జరిగింది. ధర్మేంద్రతో ప్రేమలో పడేనాటికే అతడికి ప్రకాశ్ కౌర్ అనే భార్య ఉంది. ఈ జంటకు నలుగురు పిల్లలు సంతానం. రెండో పెళ్లిఈ బంధాన్ని కాపాడుకుంటూనే మోవైపు హేమమాలినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరు 44వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హేమమాలిని భర్తతో కలిసున్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని దండలు మార్చుకున్నారు. భర్త ప్రేమగా ముద్దుపెడుతుంటే సిగ్గుపడిపోయింది హేమ. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.అప్పుడే చిగురించిన ప్రేమహేమమాలిని, ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో తొలిసారి నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికి రెడీ అయ్యారు. అయితే హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. అయినా వినకుండా 1980లో ఈ జంట పెళ్లి పీటలెక్కింది. వీరికి ఈషా, అహనా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ధర్మేంద్ర తన మొదటి భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉండగా హేమమాలిని తన పిల్లలతో వేరుగా ఉంటోంది. Photos from today at home pic.twitter.com/JWev1pemnV— Hema Malini (@dreamgirlhema) May 2, 2024More photos for you pic.twitter.com/20naRKL8gA— Hema Malini (@dreamgirlhema) May 2, 2024చదవండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ -
పెళ్లి చేసుకోనున్న బుల్లితెర జంట.. నటి ఏమందంటే?
బుల్లితెర సెలబ్రిటీలు శివంగి జోషి, కుషల్ టండన్ ప్రేమించుకుంటున్నారని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ రూమర్స్పై ఇరువురూ స్పందించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుందా?ఈ మేరకు శివంగి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. 'నాకు రూమర్స్ అంటే ఎంతో ఇష్టం. నా గురించి నాకే తెలియని విషయాలను తెలుసుకుంటుంటే భలే అనిపిస్తుంది. మీడియా మిత్రులారా.. నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుందా? ఇది నాక్కూడా తెలీదే.. నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం థాయ్లాండ్లో ఉన్నాను. మీరేమో ఏదేదో రాసేస్తున్నారు.సీరియల్లో కలిసి..కాస్త వార్త రాసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి' అని సూచించింది. అటు కుషల్ కూడా ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు పోస్ట్ చేశాడు. కాగా శివంగి, కుషల్.. బర్సాతే మౌసమ్ ప్యార్ కా అనే సీరియల్లో కలిసి నటించారు. గతేడాది ప్రారంభమైన ఈ సీరియల్ ఇటీవలే ముగిసింది. ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ఆన్స్క్రీన్లో జంటగా కనిపించిన వీరు ఆఫ్స్క్రీన్లోనూ కలిసి కనిపించడంతో ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందని అందరూ భావించారు. గతంలోనూ శివంగి.. బాలికా వధు సీరియల్ నటుడు రణ్దీప్ రాయ్తో డేటింగ్లో ఉందని రూమర్స్ వచ్చాయి. అయితే అవేవీ నిజం కాదని నటి క్లారిటీ ఇచ్చింది. అతడు కేవలం తన స్నేహితుడు మాత్రమేనని చెప్పింది.చదవండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ -
ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
ప్రముఖ లేడీ కమెడియన్ భారతి సింగ్ ఆస్పత్రిలో చేరింది. త్వరలో సర్జరీ కూడా జరగనుందని చెప్పి, అభిమానులకు షాకిచ్చింది. అలానే తన రెండేళ్ల కొడుకుని చాలా మిస్ అవుతానని కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. ఇంతకీ ఈమెకు ఏమైంది? వీడియోలో ఏం చెప్పింది?హిందీ షోల్లో యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న భారతి సింగ్.. నటుడు హర్ష్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం యాంకరింగ్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానెల్లో వీడియోలతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ని అలరిస్తూనే ఉన్నారు. అలాంటిది సడన్గా చేతికి సెలైన్ పెట్టుకుని భారతి సింగ్ కనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్)కొన్నాళ్ల క్రితం తనకు కడుపులో నొప్పిగా అనిపించిందని, అయితే పొట్టలో గ్యాస్ పెరిగిపోయిందని లైట్ తీసుకున్నానని కానీ భరించలేనంత పెయిన్ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు భారతి సింగ్ చెప్పుకొచ్చింది. వైద్య పరీక్షలు చేసిన తర్వాత పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు తేలిందని పేర్కొంది. త్వరలో తనకు సర్జరీ చేస్తారని క్లారిటీ ఇచ్చింది.హాస్పిటల్లో ఉండటం వల్ల కొడుకుని చాలా మిస్ అవుతున్నానని భారతి సింగ్ చెప్పింది. ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ అయింది. ఇకపోతే ఈమె త్వరగా కోలుకోవాలని వీడియో దిగువన ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: సినిమా అట్టర్ ఫ్లాప్.. కొత్తిల్లు కొన్న రజనీ కూతురు) -
ఎక్కువరోజులు బతకలేడు అని డాక్టర్లు చేతులెత్తేశారు: నటుడు
చాలాకాలం తర్వాత హీరామండి: ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్తో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు నటుడు శేఖర్ సుమన్. హీరామండి సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా శేఖర్ తన జీవితంలోని ఓ సంఘటనను పంచుకున్నాడు.తిరగని ఆస్పత్రి లేదు'మా నాన్న ఒక డాక్టర్.. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఆయన తన మనవడిని కాపాడలేకపోయాడు. నా కొడుకు ఆయుష్కు అరుదైన వ్యాధి సోకడంతో ఎక్కువరోజులు బతకలేడని వైద్యులు తేల్చి చెప్పేశారు. తనను ఎలాగైనా బతికించుకోవాలని ఆస్పత్రుల చుట్టూ తిరిగాను. ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ దగ్గరకు వెళ్లాను. బాబాల దగ్గరకు కూడా వెళ్లాను. బౌద్ధమతాన్ని స్వీకరించాను. కానీ ఎటువంటి అద్భుతాలు జరగలేదు.నా కుమారుడు కళ్లముందే..గుండె మార్పిడి చేయాలన్నారు. అయితే రిస్క్ ఎక్కువ అని చెప్పడంతో అందుకు ఒప్పుకోలేదు. నా కుమారుడు కళ్లముందే చావుకు దగ్గరవుతుంటే ఏమీ చేయలేకపోయాను. అతడు ఎనిమిది నెలలు మాత్రమే బతకగలడు అని చెప్పారు. కానీ వాడు నాలుగేళ్లదాకా జీవించాడు. చివరి రోజుల్లో తను ఏవేవో ఊహించుకునేవాడు. నా చేతులతో మోసుకెళ్లితన దుస్థితి చూసి దేవుడిని తనతోపాటు తీసుకెళ్లమని కోరుకోక తప్పలేదు. తన అవస్థ చూడలేకపోయాం. అలా పదకొండేళ్ల వయసులో తను ఊపిరి వదిలేశాడు. ఆ రోజు నిర్జీవంగా పడి ఉన్న అతడిని నా చేతులతో మోసుకెళ్లి అంత్యక్రియలు జరిపాము అని చెప్తూ ఎమోషనలయ్యాడు.చదవండి: సింపుల్గా ఐశ్వర్య రజనీకాంత్ గృహప్రవేశ వేడుక.. పిల్లలతో అదే ఇంట్లో!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement