-
పొత్తు.. టీడీపీ సీనియర్లు చిత్తు
సాక్షి, అమరావతి : ప్రజల్లో ఆదరణ కోల్పోయినా, పొత్తుల ద్వారా గట్టెక్కుదామనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అవి కూడా శరాఘాతాల్లా మారాయి. పొత్తులో భారీగా సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో చాలా మంది సీనియర్ల మెడపై కత్తులు వేలాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 67 పేర్లతో జాబితాను చంద్రబాబుకు ఇచ్చారు. వాటిలో కనీసం 50కి పైగా సీట్లు తమకు కేటాయించాలని కోరుతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడంతో ఆ పార్టీకి ఆరు ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పొత్తులు ఖరారైతే బీజేపీ, జనసేనకు 75 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలు వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది సీనియర్ల సీట్లు గల్లంతవుతున్నాయి. పొత్తులతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సీనియర్ నేతలు లబోదిబోమంటున్నారు. అన్ని సీట్లు వదులుకుంటే పార్టీ అధికారంలోకి రావడం అటుంచి అసలు విలువే లేకుండా పోతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అయినా పొత్తులు లేకపోతే దిగజారిపోయిన పార్టీ మనుగడే కష్టమైపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. తద్వారా పార్టీని రేసులోనైనా నిలపవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల అనేక మంది సీనియర్ నాయకుల రాజకీయ జీవితాలకు ముగింపు తప్పదని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర కకావికలం ఈ పొత్తులు ఖరారైతే ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గౌతు శిరీష, బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జి, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద్, పల్లా శ్రీనివాసరావు తదితర నేతల పేర్లు గల్లంతవనున్నాయి. ఎచ్చెర్లపై ఎన్నో అశలు పెట్టుకున్న కళా వెంకట్రావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. విశాఖలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సీటు ఎగిరిపోనుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అశోక్గజపతిరాజు వంటి సీనియర్ తన కుమార్తెకు సీటు ఇప్పించుకోలేక సతమతమవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలకు తప్పని పొత్తు పోట్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కీలకమైన సీనియర్లకు పొత్తు పోట్లు తప్పేలా లేవు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్ఖాన్, బొండా ఉమామహేశ్వరరావులను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడనుంది. అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెనాలిలో ఆలపాటి రాజా, నక్కా ఆనంద్బాబు వంటి నేతలకు షాక్ తగలనుంది. ఆలపాటి రాజా ఇప్పటికే తన సీటు పోతే ఒప్పుకునేది లేదని అనుచరులను ముందుపెట్టి హడావుడి చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్, భూమా అఖిలప్రియకు టాటా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పలువురు కీలక నాయకులు పొత్తుతో రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, నగరిలో గాలి భానుప్రకాష్, తిరుపతిలో సుగుణమ్మ, శ్రీకాళహస్తిలో బొజ్జల సుదీర్రెడ్డి, రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు, జమ్మలమడుగులో భూపే‹Ùరెడ్డి వంటి నేతలు పోటీ నుంచి తప్పుకోక తప్పదంటున్నారు. పొత్తులో బీజేపీ విశాఖ, విజయవాడ, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి గత ఎన్నికల్లో లోకేశ్ తోడల్లుడు భరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఆ సీటు బీజేపీకి పోతే ఆయన భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. విజయవాడ సీటును సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో అక్కడి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో కేశినేని చిన్నికి సీటు పోయినట్లేనని భావిస్తున్నారు. జనసేన కోరుతున్న నియోజకవర్గాలు ♦ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస ♦ ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల. ♦ ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక. ♦ ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం. ♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట. ♦ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు. ♦ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు : దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం. గోదావరి జిల్లాల్లో సీనియర్ల సీట్లు గల్లంతే గోదావరి జిల్లాల్లోనూ చాలా మంది ముఖ్య నాయకుల మెడపై కత్తి వేలాడుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోట సీతారామలక్ష్మి, కేఎస్ జవహర్, ఎస్వీఎస్ వర్మ వంటి వారు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. బుచ్చయ్యచౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబట్టి తన సీటు ఉంటుందని చెప్పుకుంటున్నా దానికి గ్యారంటీ లేదు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సీటు ఇప్పటికే ఎగిరి పోయింది. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం సీటును నిరాకరిస్తుండడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం సీటు జనసేనకు పోతుండడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఇప్పటికే తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. వీరు కాకుండా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ పిల్లి అనంతక్ష్మి, ఐతాబత్తుల ఆనందరావు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు వంటి నేతలకు టికెట్లు గల్లంతవనున్నాయి. -
హామీలు నెరవేర్చని బాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు
-
బడ్జెట్ ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
-
ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సభలో చర్చ
-
Live: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Updates.. ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా ►9 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చాం. హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు. నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచిపనైనా జరిగిందా?. అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే మేం చేసింది తక్కువే. మాది సంక్షేమ ప్రభుత్వం: ఎమ్మెల్సీ రవీంద్రబాబు ప్రతీ సంక్షేమ పథకం ప్రజల మేలు కోసమే అమలు చేశాం మా ప్రభుత్వానికి పబ్లిసిటీ ముఖ్యం కాదు.. ప్రజలకి మేలు జరగడం ముఖ్యం రాష్ట్రానికి కోవిడ్ సమయంలో రావాల్సిన ఆదాయం రాలేదు రెండేళ్ల కోవిడ్ సమయంలో రెండు లక్షల కోట్ల రూపాయిల ఆదాయం తగ్గిపోయింది గడిచిన నాలుగన్నరేళ్ల పాలనలో 4.60 లక్షల కోట్లు ప్రజలకి నేరుగా అందించాం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల ఖాతాలలోకి నిధులు జమ చేశాం మా ప్రభుత్వం వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలకి అధిక ప్రాధాన్యతనిచ్చింది ప్రతీజిల్లాకి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు లేకే ఉక్రెయిన్ లాంటి సుదూర దేశాలకి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది ఆర్ధిక ఇబ్బందులు ఉన్న్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదు ►శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ముందు వ్యక్తిగతంగా హాజరైన వంశీకృష్ణ యాదవ్. న్యాయవాదులతో కలిసి చైర్మన్ ముందు హాజరు మూడు బిల్లులకి శాసనమండలి ఆమోదం ఆర్జేయూకేటీ విశ్వ విద్యాలయ సవరణ బిల్లు, ఏపీ అసైన్ భూముల సవరణ బిల్లు, ప్రభుత్వ సేవలలో నియామకాల క్రమబద్దీకరణ, సిబ్బంది తీరు, వేతనవ్యవస్ధ హేతుబద్దీకరణ సవరణ బిల్లులకి శాసన మండలి ఆమోదం శాసన మండలి పదినిమిషాలు వాయిదా పెద్దల సభలోనూ మారని టీడీపీ సభ్యుల తీరు చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన, నినాదాలు చైర్మన్ వారించినా వినిపించుకోని టీడీపీ ఎమ్మెల్సీలు సభకు అంతరాయం కలిగించవద్దని చైర్మన్ విజ్ణప్తి పట్టించుకోకుండా టీడీపీ ఎమ్మెల్సీల నినాదాలు దీంతో, శాసన మండలి వాయిదా అంతకముందు జాబ్ క్యాలెండర్, దిశ, మద్యపాన నిషేదంపై ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసన మండలి చైర్మన్ ►సభలో టీడీపీ సభ్యుల నినాదాలు, సభా కార్యక్రమాలకు అడ్డుకునే యత్నం ►కాసేపు శాసనసభ వాయిదా ►అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన సీఎం జగన్ ►ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపిన అసెంబ్లీ ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం ►అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్ ►ఈరోజు కూడా స్పీకర్ ఛాంబర్ వద్దకు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు ►స్పీకర్ తమ్మినేని వద్దకు వెళ్లి నినాదాలు చేసిన టీడీపీ నేతలు ►టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీరియస్ ►టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని. ►నేడు ఏపీ అసెంబ్లీలో చివరి రోజు(నాలుగో రోజు) బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట బడ్జెట్ను అసెంబ్లీ ఆమోదించనుంది. ►ఎన్నికల నేపథ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలుపునుంది. ►అలాగే, నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే వారికి వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై విచారణ జరుగనుంది. ►పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై విచారణ. వ్యక్తిగతంగా విచారించనున్న శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్లకు నోటీసులు ఇచ్చారు. -
స్పీకర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు
-
కౌన్సిల్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అమర్నాథ్
-
మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంధంలా భావించారు
-
Live: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024
-
AP Budget: ఏపీ బడ్జెట్ ప్రసంగం ఇదే..
Updates.. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.. ►ఏపీ శాసనసభ రేపటికి వాయిదా. ►శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ►శాసన మండలి రేపటికి వాయిదా. ►అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్. రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు. మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు. ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు. రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతం. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత గ్రంధంగా భావించారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను మా ప్రభుత్వం చేసింది. ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర సుపరిపాలన.. గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలు. 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు ప్రతీ జిల్లాలో దిశ పీఎస్లను ఏర్పాటు చేశాం. భద్రత, మౌళిక సదుపాయాలను పెంచాం. 13 నుంచి 26 జిల్లాలకు జిల్లాల పెంపు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం, వినూత్న పద్దతుల ద్వారా విద్యాబోధన సులభతరం. రూ.3367కోట్లతో జగనన్న విద్యాకానుక 47లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుక 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలు అందించాం. జగన్నన గోరుముద్ద కోసం రూ.1910కోట్లు ఖర్చు గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్టు ఇది ఎక్కువ సంపూర్ణ పోషణం పథకం ద్వారా గర్బిణులకు మేలు. ఉచితంగా విద్యార్థులకు 9.52,925 ట్యాబ్స్ 34లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం. రూ.11901 కోట్లతో జగనన్న విద్యాదీవెన రూ.4267కోట్లతో జగనన్న వసతీ దీవెన ఇప్పటి వరకు 52లక్షల మందికి లబ్ధి డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతాని తగ్గింపు. విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి లబ్ధి. ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు. నిర్విరామగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25లక్షలకు పెంపు. ఆరోగ్యశ్రీ వ్యాధులను 3257కు పెంచాం. 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ధి. కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్భంది నియామకం,. ఏపీలో 192 స్కిల్ హబ్లు, 27 స్కిల్ కాలేజీలు నైపుణ్య శిక్షణ ద్వారా 95 శాతం మందికి ఉద్యోగాలు. విద్యార్థుల శిక్షణ కోసం వర్చువల్ ల్యాబ్లు 201 పాఠశాలల్లో వర్చువల్ ల్యాబ్స్ అమ్మఒడి ద్వారా 43.61లక్షల మహిళలను మహరాణులను చేశాం. అమ్మఒడి కింద రూ.26,067కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు ఖర్చు. వ్యవసాయం రంగం.. జగనన్న పాలవెల్లువ కింద రూ.2697కోట్లు. 29 దిశా పోలీసు స్టేష్లను ఏర్పాటు. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద 53.53 లక్షలు రైతులకు సాయం. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ రూ.33,300 కోట్లు. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు రూ.13500 సాయం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు. ఉచిత పంటల బీమా కింద రూ.3411 కోట్లు. సున్నా వడ్డీ పంట రుణాల కింద 1835 కోట్లు. రైతులకే నేరుగా సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్. వ్యవసాయ రంగం విద్యుత్ కోసం రూ.37374 కోట్ల సబ్సిడీ. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1277 కోట్లు అందించాం. వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటు యంత్ర సేవల పథకం కింద రైతులకు యంత్రాలు. ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4363 కోట్లు అందించాం. 2356 మంది ఉద్యానవన సహాయకులు నియామకం. 10,216 వ్యవసాయ గోదాముల నిర్మాణాలు. ఆక్వా రంగం.. వైఎస్సార్ మత్య్సకార భరోసా 2లక్షల 43వేల కుటుంబాలకు మేలు. చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం 4వేల నుంచి 10వేలకు పెంపు. అంతర్జాతీయ ప్రమాణాలతో పది ఫిషింగ్ హార్బర్లు. ఆక్వాకల్చర్ కింద 12వేల హెక్టార్ల విస్తీర్ణం. 16లక్షల 5వేల మందికి జీవనోపాధి. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం ఐదేళ్లలో 30.65లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. ఐదేళ్లలో 2.53లక్షల కోట్ల నగదు బదిలీ. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం. వైఎస్సార్ పెన్షన్ను మూడు వేలకు పెంచాం. 66.35లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్లకు ఐదేళ్లలో 84731 కోట్లు ఖర్చు చేశాం. 9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్ పంపిస్తున్నాం. వైఎస్సార్ బీమా కింద రూ.650 కోట్లు ఖర్చు. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.350 కోట్లు పంపిణీ. ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు పంపిణీ కాపునేస్తం కింద రూ.39,247 కోట్లు పంపిణీ. నేతన్ననేస్తం కింద రూ.983 కోట్లు. జగనన్న తోడు కింద రూ.3374 కోట్లు జగనన్న చేదోడు కింద రూ.1268 కోట్లు. వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5కోట్లు. బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీ సంక్షేమం కోసం రూ.71,170 కోట్లు ఖర్చు. పోర్టులు, పరిశ్రమలు... ఏపీ పారిశ్రామిక విధానం 2019-27ను తీసుకొచ్చాం. ఏపీలో ఓడరేవుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం. పోర్టుల నిర్మాణం ద్వారా 75వేల మందికి ఉపాధి. రూ.3800 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ఫైబర్ గ్రిడ్తో ప్రతీ గ్రామం అనుసంధానం. 55వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పాటు. గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం. అవుకు రెండో టన్నెల్ పూర్తి. 1079కోట్లతో మూడో టన్నెల్. 77చెరువులతో అనుసంధాన ప్రాజెక్ట్ను ప్రారంభించాం వర్షాలపై ఆధారపడిన రైతులకు ఎంతో మేలు. ప్రాధన్య ప్రాజెక్ట్ల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.10137 కోట్లతో తొమ్మిది త్రాగునీటి పథకాలు మంజూరు. సుజలధార ప్రాజెక్ట్ ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం. రాష్ట్ర స్థాల ఉత్పత్తి రేటులో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి పురోగమించాం. జాతీయ ఆహార భద్రతలో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్దానీ చీరకు బంగారు బహుమతి. చేనేత ఉత్పత్తులకు ఏపీకి మరో నాలుగు అవార్డులు. అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఏపీకి మూడో స్థానం. 311కుపైగా భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటు. మెగా పరిశ్రమల ద్వారా 1.30లక్షల మందికి ఉపాధి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా రూ.5995 కోట్ల పెట్టుబడి. పెట్టుబడులు.. సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానం. వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 నుంచి ఆరో స్థానానికి. రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేసిన ప్రభుత్వం మనదే. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన రూ.15,711 కోట్ల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి. 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 14 ఎలక్ట్రానిక్ కంపెనీల స్థాపన ద్వారా 34,750 మందికి ఉపాధి. 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు. 12042 ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 117 ఒప్పందాలు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రూ.19,345 కోట్ల మేర ఒప్పందాలు. వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు. తిరుపతిలో 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాం. పురోగతిలో 13 న్యాయ భవన నిర్మాణాలు. 10893 గ్రామ పంచాయతీ భవనాలు. 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు. 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. ఆడుదాం ఆంధ్ర.. ఐదు అంచెల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. విజేతలకు 12కోట్ల 21లక్షల విలువైన బహుమతులు. 41 క్రీడా వికాస కేంద్రాలు పూర్తి, పురోగతిలో 65 క్రీడా వికాస కేంద్రాలు జగనన్న పచ్చతోరణం కింద ఐదుకోట్ల 11లక్షల మొక్కలు నాటాం. నగరతోరణం కింద పట్టణ, శివార్లలో పచ్చదనం. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాలను ప్రారంభించాం. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ల నియామకం. 17లక్షల 53వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు. నాలుగు లక్షల 80వేల మ్యుటేషన్లలకు పరిష్కారం. ఉద్యోగాలు.. ఐదేళ్లలో నాలుగు లక్షల 93వేల ఉద్యోగాలు కల్పించాం. ఇందులో 213662 శాశ్వత నియామకాలు. 10వేల మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 11వ వేతన సవరణ సంఘ సిఫార్సులు అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచాం. పోలీసు వ్యవస్థలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 2019-23 మధ్య ప్రజా పంపిణీ కోసం రూ.29628 కోట్లు ఖర్చు. గత ఐదేళ్లలో రూ.4.23లక్షల కోట్లు ప్రజలకు బదిలీ. డీబీటీ ద్వారా రూ.2.53లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం. నాన్ డీబీజీ ద్వారా రూ.1.68 కోట్లు అందించాం. కేబినెట్ భేటీలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు.. ►2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించిన మంత్రిమండలి. ►నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం. ►డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల. ►నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ►ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల. ►ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి. ►అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్. ► టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని. ►మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ►ప్రజాసమస్యలపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదు: బుగ్గన సభను అడ్డుకోవడానికి టీడీపీ సభ్యులు వచ్చారు. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ►అసెంబ్లీలో మళ్లీ గందరగోళం ►తీరుమార్చుకోని టీడీపీ సభ్యులు ►ఈరోజు కూడా స్పీకర్ తమ్మినేని వెల్లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు ►సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులు. ►సభా మర్యాదలు పాటించని టీడీపీ సభ్యులు. ►రెడ్లైన్ దాటి స్పీకర్ వెల్లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు. ►ఈరోజు కూడా పేపర్లు చింపి స్పీకర్పై వేసిన టీడీపీ సభ్యులు. ►సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యుల తీరు. ►స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన టీడీపీ సభ్యులు ►స్పీకర్ను అవమానపరిచేలా టీడీపీ సభ్యుల నినాదాలు. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం ►బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ►తొలిమూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ►సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం ►సెక్రటేరియట్కు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో కేబినెట్ సమావేశానికి హాజరు బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్: బుగ్గన రాజేంద్రనాథ్ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశాం ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న, నిస్సహాయ పేద వర్గాలే మా ప్రాధాన్యత గత ఐదేళ్ల బడ్జెట్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశాం. ►మంత్రి బుగ్గన కార్యాలయంలో బడ్జెట్ ప్రతులకు పూజలు ►సెక్రటేరియట్కు చేరుకున్న మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు. ►సెక్రటేరియట్కు బయల్దేరిన మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆర్థికశాఖ అధికారులు ►మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఫైనాన్స్ సెక్రటరీ రావత్, ఆర్ధికశాఖ అధికారులు ►మరికొద్దిసేపట్లో సెక్రటేరియట్కు బయల్దేరనున్న మంత్రి బుగ్గన, అధికారులు ►అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పత్రాలకు దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు ►ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్ధిక శాఖ అధికారులు ►ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. ►రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ►ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. ►అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను చదువుతారు. ►అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది -
మళ్లీ మన ప్రభుత్వమే: సీఎం జగన్
రాష్ట్ర విభజన నుంచి ఇప్పటికి కూడా మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోంది. మనం కలసికట్టుగా 60 ఏళ్లపాటు ఉమ్మడిగా హైదరాబాద్ను నిర్మించుకున్నాం. అది ఎకనామిక్ పవర్ పాయింట్. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. ‘ట్యాక్స్ బాయోన్సీ’ అన్నది చాలా చాలా ముఖ్యం. పెద్ద పెద్ద నగరాల్లోనే ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను విశాఖపట్నం గురించి గట్టిగా చెబుతా. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం వాగ్దానాలను ఈ ఐదేళ్లలో అమలు చేశాం. ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు కోరుతున్నాం. వైఎస్సార్సీపీ చేయగలిగిందే చెబుతుంది. చెప్పింది ఏదైనా సరే కచ్చితంగా చేసి తీరుతుంది. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అఖండ మెజారిటీతో ప్రజల మన్ననలు పొంది మళ్లీ 3 నెలలకు ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో ఏర్పడిన రెవెన్యూ లోటు, చంద్రబాబు సర్కారు నిర్వాకంతో పెరిగిన ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి లాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొని గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు మంచి చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ లోటు, తగ్గిన ఆదాయం, పెరిగిన ఖర్చులు, కేంద్ర నిధుల తగ్గుదలను గణాంకాలతో సహా వివరించారు. టీడీపీ హయాంలో రాబడి, అప్పులు, ఖర్చులను వైఎస్సార్సీపీ వచ్చాక ఎలా ఉందో వెల్లడిస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు. అంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని కూడా గత సర్కారు చేయని విధంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించామని గుర్తుచేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాలతో ప్రజలకు మొత్తం రూ.4.31 లక్షల కోట్లను అందించామన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ వాస్తవాలను వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ► గత ప్రభుత్వ విధానాలతో కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత కుదేలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2018 మార్చిన విడుదల చేసిన నివేదికను గమనిస్తే విద్యారంగంలో జీఈఆర్ రేషియో జాతీయ స్థాయిలో 96.91 శాతం ఉంటే మన రాష్ట్రంలో 83.29 శాతమే ఉంది. ఆ డేటా చూస్తే అమ్మ ఒడి పథకం ఎంత అవసరమో అందరికీ అర్థమవుతుంది. గత సర్కారు హయాంలో ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల ఎన్రోల్లో రాష్ట్రం చివరిన మూడో స్థానంలో ఉంది. దాన్ని మనం ఏ స్థాయికి తీసుకొచ్చామో గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. ► చంద్రబాబు రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారు. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేకపోయారు. రైతుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. మనం వచ్చాక రైతు భరోసా పథకం అందించి తోడుగా నిలిచాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేస్తానని దగా చేశారు. మనం అధికారంలోకి వచ్చాక పొదుపు సంఘాలకు జీవం పోశాం. ► ‘ట్యాక్స్ బాయోన్సీ’ అన్నది అత్యంత ప్రధానం. పెద్ద పెద్ద సిటీల్లో ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను విశాఖపట్నం గురించి గట్టిగా చెబుతా. జాతీయ స్థాయిలో జీడీపీ గమనిస్తే వ్యవసాయ రంగం నుంచి 18 శాతం ఉంటే తెలంగాణలో 17 శాతం ఉంది. మన రాష్ట్రంలో 34 శాతం వ్యవసాయ రంగం నుంచి ఉంది. మనది రైతులతో కూడిన ఎకానమీ. దీని వల్ల ఎబిలిటీ టూ జనరేట్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గుతుంది. హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం, విభజన వల్ల రాష్ట్రం ఏటా రూ.13 వేల కోట్లను ఆదాయపరంగా నష్టపోతున్నాం. ఈ పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లు నష్టపోయాం. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో చట్టంలోనైనా ప్రత్యేక హోదా ఇస్తామని పొందుపరచి ఉంటే మనం కోర్టుకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. చట్టంలో చేర్చకపోవడంతో ప్రత్యేక హోదా ఎండమావిగా మారిపోయింది. కేంద్రంలో అధికార పారీ్టకి పూర్తి మెజారిటీ లేకపోతే, మన మద్దతు అడిగిన వారిని మనం గట్టిగా డిమాండ్ చేయగలిగేవాళ్లం. ► ఇన్ని ఇబ్బందులు, సవాళ్ల మధ్య మన ఆర్థిక వ్యవస్థను 56 నెలలుగా సమర్థంగా నడుపుతూ ముందడుగులు వేస్తున్నాం. ఎక్కడా అవినీతి అన్నదే లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేశాం. మన ప్రభుత్వం రాకముందు నిధులు అవినీతి లేకుండా ప్రజలకు చేరేవి కాదు. ఈరోజు బటన్ నొక్కడం ద్వారా నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తున్నాం. ఎక్కడ లంచాలు, వివక్ష లేదు. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం. నాన్ డీబీటీ స్కీమ్స్ ద్వారా మరో రూ.1.07 లక్షల కోట్లు ఇచ్చాం. (ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ కూడా తీసుకుంటే దాదాపు రూ.1.76 లక్షల కోట్లు ఉంటుంది) ► మన ప్రభుత్వానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెబుతూ గోల చేస్తోంది. మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎక్కువ, మూలధన వ్యయం తక్కువ అని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ బటన్ నొక్కుతున్నాడని ఆరోపిస్తున్నారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చంద్రబాబు హయాంలో సగటున రూ.15,227 కోట్లు కాగా మన ప్రభుత్వ పాలనలో రూ.17,757 కోట్లుగా ఉంది. నాడు– నేడు ద్వారా స్కూళ్లు, ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నాం. అదనంగా మూడు పోర్టులు నిర్మిస్తున్నాం. ► ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసిందని గర్వంగా చెబుతున్నా. ఇచ్చిన హామీలను ఏకంగా 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు అందుకుంటున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఇంటింటి ఆర్థిక వ్యవస్థను మనం మార్చగలిగాం. ► చంద్రబాబు వయసు 75 ఏళ్లు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు. మొదటిసారి సీఎం అయి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. మూడు సార్లు సీఎం అయ్యారు. ఇన్నేళ్ల తరువాత కూడా ఫలానిది చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి... అని అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు. మరోసారి అవకాశం ఇస్తే ఇది చేస్తా అది చేస్తా అంటున్నారు. చంద్రబాబు ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశారు. ఏ గ్రామంలోనైనా చంద్రబాబు ఫలానిది చేశారని చెప్పేందుకు ఒక్క బిల్డింగ్ కనిపించదు. స్కూళ్లన్నీ నిర్వీర్యం చేశారు. మరోసారి కొత్త ఎరలతో ఆ పెద్ద మనిషి బయలుదేరారు. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాంతం. హైదరాబాద్లో కూర్చొని అరడజను వాగ్ధానాలతో కిచిడి చేసి మేనిఫెస్టో రూపంలో తెచ్చారు. మేనిఫెస్టోలో వందల హామీలు ఇస్తారు. ఎన్నికల తరువాత చెత్తబుట్టలో వేస్తారు. ఒక్క అబద్ధమాడితే 2014లోనే సీఎం అయ్యేవాడిని 2014 ఎన్నికల్లో మనకు 45 శాతం ఓట్లు వస్తే మనకంటే దాదాపుగా ఒక్క శాతం ఓట్లు అధికంగా పొంది చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మనకు చంద్రబాబుకు తేడా ఒక్క శాతం మాత్రమే. నాడు మనం కూడా రూ.87 వేల కోట్లు రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ హామీ ఇద్దామని చాలా మంది నాకు చెప్పారు. చేయలేనిది చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదని ఆ రోజు నేను చెప్పా. ఆ రోజు నేను అధర్మం చేయని కారణంగా ఒక్క శాతం ఓటు తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా. ఒక్క అబద్ధం చెప్పి ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేవాడిని. కానీ ఈ రోజు కూడా నాకు రిగ్రేట్ లేదు. వెనక్కి వెళ్లి మళ్లీ అబద్ధం చెప్పను. నా నోట్లో నుంచి అబద్ధాలు రావు. నేను ఆ రోజు చేసిన పని వల్ల అధికారంలోకి రాకపోవచ్చు. కానీ విశ్వసనీయత అన్న పదానికి అర్థం జగనే అని ప్రజలు నమ్మారని గర్వంగా చెబుతున్నాను. కరోనా విపత్తు వల్ల రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం వివరాలు రాష్ట్ర ఆదాయం తగ్గినా... ► జఠిల పరిస్థితుల్లో మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. దేశంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. కోవిడ్తో రాష్ట్ర ఆదాయం తగ్గింది. అనుకోకుండా ఖర్చులు పెరిగాయి. సాధారణంగా ఏటా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కానీ గత ఐదేళ్లలో అనూహ్య పరిస్థితులు చూశాం. కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా బాగా తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ తగ్గాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని నడిపించాల్సి వచ్చింది. రాష్ట్ర విభజనతో వచ్చిన ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి. రెవెన్యూ లోటును అధిగమిస్తూ గొప్ప పాలన అందించాం. ► 2015– 2019లో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ 13.29 శాతం పెరిగింది. ఆ ప్రకారం గ్రోత్ రేట్ ఉంటే మనకు 2019–24 మధ్య రూ.2,24,603 కోట్లు రావాలి. కానీ రాష్ట్రానికి కేవలం రూ.1,15,552 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 12.76 శాతం ఉండటంతో అనుకున్న మేర మనకు నిధులు ఇవ్వలేకపోయింది. ఈ రకంగా కూడా రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చింది. ఆదాయం కోల్పోవడం, ఖర్చుల భారం పెరగడంతో ఆర్థిక వ్యవస్థలో కుదుపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గణాంకాలు గమనిస్తే 2013– 14లో జీడీపీ రేషియో 50 శాతం ఉంది. వారు అనుసరించిన విధానాల వల్ల 2018 నాటికి డెట్ జీడీపీ రేషియోను 48 శాతానికి తగ్గించారు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇది 61 శాతానికి పెరిగింది. ఇవాళ 57 శాతం ఉంది. ► 2015–2019 మధ్య కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తే 35 శాతం ఇచ్చింది. చంద్రబాబు సర్కారుకు ఆ మాత్రమైనా లబ్ధి కలిగింది. కేంద్రం రాను రాను సెస్లు, సర్చార్జ్ల పేరుతో వాటాను తగ్గించింది. మన ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర పన్నుల్లో 31 శాతం వాటా మాత్రమే ఇచ్చారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సి పన్నుల వాటా గమనిస్తే జీఎస్డీపీ 2018– 19లో రూ.32 వేల కోట్లు ఉండగా 2019–20లో రూ.28 వేల కోట్లుకు తగ్గింది. 2022– 2023లో రూ.24 వేల కోట్లకు పడిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల అప్పుల వివరాలు అప్పులపై పదే పదే అబద్ధాలు ► అబద్ధాల బ్యాచ్ చేసే మరో ఆరోపణ.. రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందట! నోటికి హద్దుపద్దు లేకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు చెబుతున్నారు. విభజన నాటికి రూ.1.53 లక్షల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు దిగిపోయే నాటికి మొత్తంగా రూ.4,12,288 కోట్లు అప్పులున్నాయి. రూ. 4,12,288 కోట్లు అప్పు నుంచి మనం ప్రయాణం మొదలు పెడితే ఇప్పుడు రూ.7.03 లక్షల కోట్లకు చేరింది. చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల రేటు 21.78 శాతం ఉంటే మన హయాంలో కేవలం 12.13 శాతమే ఉంది. చంద్రబాబు సమయంలో బటన్లు లేవు, స్కీమ్లు లేవు. అప్పుడు ఉన్నది దోచుకో..పంచుకో..తినుకో మాత్రమే. ► పరిమితి మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని కౌరవ సైన్యం ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య పరిమితికి మించి రూ.28,457 కోట్లు అప్పులు చేశారు. మన హయాంలో ఆర్థిక సంఘం సిఫార్సుల కంటే రూ.366 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. ఇది వాస్తవం కాదా? ► టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు 7.5 శాతం ఉన్నాయి. అదే సమయంలో కేంద్రం అప్పులు 3.6 శాతమే ఉన్నాయి. మన హయాంలో కేంద్రం అప్పులు 6.5 శాతం ఉంటే మనం అప్పు చేసింది 5.6 శాతం మాత్రమే. అప్పుల పరంగా గానీ, ప్రభుత్వ పరంగా గానీ ఎలా చూసినా సరే గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి చాలా తేడా ఉందని గర్వంగా చెబుతున్నా. ► మన ప్రభుత్వం రూ.2.90 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఒకడు రూ.13 లక్షల కోట్లు అంటారు. మరొకడు రూ.10 లక్షల కోట్లు అంటారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క కుటుంబానికీ మంచి చేయలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎవరి బ్యాంకు ఖాతాలో ఎంత వేశారు? మన ప్రభుత్వం వచ్చాక ఎంత వేశాం? ఇంటింటికీ వెళ్లి చూడమని చెబుతున్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్.. మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేట్ అప్పటికంటే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. చంద్రబాబు మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా ప్రజల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఎందుకు వేయలేకపోయారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో కూడా ఆలోచించాలి. మా హయాంలో ప్రతి రూపాయికీ లెక్క ఉంది. ఆధార్ నంబర్లతో సహా బ్యాంకు ఖాతాల వివరాలు ఇస్తాం. ఎవరికి ఎంత ఇచ్చామో మేం చెప్పగలం. మరి టీడీపీ హయాంలో నిధులను ఎలా ఖర్చు చేశారో చెప్పగలరా? ఆ నిధుల్లో చంద్రబాబు తిన్నది ఎంత? దత్తపుత్రుడికి ఇచ్చింది ఎంత? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కూడిన ఎల్లో మీడియాకు ఇచ్చింది ఎంత? చంద్రబాబు పాలనాకాలంలో పెరిగిన రెవెన్యూ లోటు వివరాలు (పింక్ కలర్లో) బాబు పాలనంతా రెవెన్యూ లోటే ► మనం వెచ్చిస్తున్న రూ.70 వేల కోట్లకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్నారే.. మరి రూ.1.24 లక్షల కోట్లు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే చంద్రబాబు సంపద సృష్టిస్తారంటూ ఎల్లో మీడియా డప్పు కొడుతోంది. చంద్రబాబు ట్రాక్ రికార్డు గమనిస్తే ఆయన సీఎం కాకమునుపు రెవెన్యూ మిగులు ఉండేది. చంద్రబాబు సీఎం అయ్యాక ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ లోటే కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెవెన్యూ మిగులు ఉంది. చంద్రబాబు ప్రజలకు ఏ స్కీమ్ కూడా అమలు చేయలేదు. మరి ఎక్కడ సంపద సృష్టించారో ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు విజనరీ అయితే.. ఆయన పాలనలో రాష్ట్రం మెరుగుపడి ఉంటే జీడీపీలో మన జీఎస్డీపీ వాటా ఎంత అని గమనించాలి. 2014–19లో రాష్ట్రం దేశానికి పన్నుల కింద 4.47 శాతం వాటా ఆదాయం ఇస్తే.. మన హయాంలో ఈ ఐదేళ్లలో 4.82 శాతం వాటా ఆదాయాన్ని కేంద్రానికి ఇచ్చాం. దీనిని బట్టి ఎవరు సంపద సృష్టించారో స్పష్టంగా కనిపిస్తోంది. అది కూడా రెండేళ్లు కోవిడ్ ఉన్నా, ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా, ఇన్ని పథకాలు అమలు చేస్తూనే ఈ స్థాయిలో జీఎస్డీపీ కేంద్రానికి ఇచ్చాం. ► మనసు లేని నాయకుడు, మోసం చేసే నాయకుడు కేవలం వాగ్ధానాలు మాత్రమే చేస్తాడు. మనసున్న ప్రభుత్వం, అమలు చేసే నిజాలు చెబుతుంది. ఇదీ ఆయనకు, మనకు ఉన్న తేడా. చంద్రబాబుకు వాగ్ధానాలు అమలు చేసే ఉద్దేశం లేదు. అమలు చేసిన చరిత్ర అంత కన్నా లేదు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏ ఒక్కరైనా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే! ► చంద్రబాబు రకరకాల మోసాలు చేశారు కాబట్టే ఆ పార్టీని 23 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మాట మీద నిలబడ్డాం కాబట్టే 151 స్థానాలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఎన్నికలోనూ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్సార్ సీపీని గెలిపించారు. విశ్వసనీయత అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది. ఫలానా వ్యక్తి నమ్మకస్తుడనే గుర్తింపు సంపాదించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. దేవుడి దయ వల్ల ఆ పేరు వైఎస్సార్ సీపీ సంపాదించుకోగలిగిందని గర్వంగా చెబుతున్నా. ఈ రోజు కూడా చెబుతున్నా.. వైఎస్సార్ సీపీ చేయగలిగిందే చెబుతుంది. చెప్పింది ఏదైనా కూడా కచ్చితంగా మాట మీద నిలబడుతుందని వంద శాతం చెబుతున్నాను. టీడీపీ ఇప్పుడు ఇస్తున్న కొన్ని ఎన్నికల హామీలు అమలు చేయాలంటే అయ్యే ఖర్చు వివరాల అంచనా అధికారం కోసం అడ్డగోలు హామీలు జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు! సంక్షేమ పథకాలతో అభివృద్ధి ఆగిపోతుంది. రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుంది అని చంద్రబాబు ఇన్నాళ్లూ మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అవే రాతలు రాశాయి. ఎన్నికలు వచ్చేసరికి జగన్ ఇంతేనా ఇచ్చేది? నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. వీళ్లకు నిజంగా చిత్తశుద్ధి, నిబద్ధత ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రజలను మోసం చేసేందుకు, దోచుకుని పంచుకునేందుకే వీళ్లకు అధికారం కావాలి. చంద్రబాబు మేనిఫెస్టో ఏది చూసినా ఇవే మోసాలు కనిపిస్తాయి. 1995 నుంచి ఇప్పటివరకు చంద్రబాబు మేనిఫెస్టోల్లో 650 వాగ్దానాలు చేశారు. వాటిలో 10 శాతం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా? ప్రజలను మరోసారి మోసగించేందుకే చంద్రబాబు ఆరు వాగ్దానాల పేరుతో వస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని నమ్మడం కరెక్టేనా? అని ప్రజలు ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబును నమ్మితే... బంగారు కడియం ఇస్తానని చెప్పి అమాంతంగా తినేసే పులిని నమ్మినట్టే. ► ఇవాళ 66.34 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. దీనికి ఏడాదికి రూ.36 వేల కోట్లు అవుతుంది. ఉచిత విద్యుత్కు రూ.11 వేల కోట్లు ఖర్చు అవుతుంది. సబ్సిడీ కింద బియ్యం రూ.4,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108కు రూ.4,400 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.2,800 కోట్లు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద లాంటి 8 పథకాలకు ఏటా రూ.53 వేల కోట్లు ఖర్చు అవుతుంది. వీటిని ఎవరూ రద్దు చేయలేరు. ► వాటికి చంద్రబాబు చెప్పిన 6 హామీలు అదనంగా చేరిస్తే.. మహాశక్తి పథకానికి రూ.36 వేల కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.12,400 కోట్లు, యువగళం పథకానికి రూ.7,200 కోట్లు, దీపం పథకానికి రూ.4,634 కోట్లు, అన్నదాత పథకానికి రూ,10,706 కోట్లు కలిపి రూ.73 వేల కోట్లు అవుతుంది. కచ్చితంగా అమలు చేయాల్సిన 8 పథకాలకు అయ్యే రూ.53 వేల కోట్లకు రూ.73 వేల కోట్లు కూడా కలిపితే రూ.1.26 లక్షల కోట్లు ఏటా ఖర్చు చేయాల్సి వస్తుంది. దుర్భుద్ధితో ప్రజలను దగా చేయడం చంద్రబాబుకు ధర్మమేనా? -
చెయ్యలేనిది చెప్పకూడదు...మాట ఇస్తే తప్పకూడదు: సీఎం జగన్
-
చంద్రబాబు పేరు చెప్తే ఇప్పటికీ గుర్తుకొచ్చేది వెన్నుపోటే
-
ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్తోంది
-
2024 జూన్ లో మళ్లీ మన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతుంది
-
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయి
-
ఏపీ ప్రభుత్వ విద్యార్థులు అమెరికా వెళ్లడం గొప్ప విషయం..!
-
గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదం
-
‘చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. ‘సీఎం జగన్ రూ.2లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశారు. ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంది. నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకు లేదు. మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం జగన్ చెప్పారు.నాయకత్వం అంటే సీఎం జగన్ది.మేనిఫెస్టోలోని ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గింది. కరోనా కష్టకాలంలో కూడా పేదవాడికి తోడుగా సీఎం జగన్ నిలబడ్డారు. అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు మంచి చేసింది కనుకనే ఈరోజు ధైర్యంగా చెప్పుకుంటున్నాం’ అని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ‘పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చంద్రబాబుకు కడుపుమంట. రాజకీయమే అజెండాగా చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. మాటలతో మభ్యపెట్టే చంద్రబాబుని ప్రజలు నమ్మరు. చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం? చంద్రబాబు చెప్పుకునేందుకు ఓ మంచి పథకం ఉందా?. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’ అని శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. -
అసెంబ్లీలో టీడీపీ అరాచకాలు..!
-
టీడీపీ పాలనలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు?: సుధాకర్ బాబు
-
రెడ్ లైన్ దాటి స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు
-
మాజీ ఎమ్మెల్యేల మృతికి అసెంబ్లీలో సంతాపం..!
-
మమ్మల్ని రెచ్చగొడుతున్నారు.. జాగ్రత్త టీడీపీ నేతలకు అంబటి వార్నింగ్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సాక్షి ఆఫీస్లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
ఆప్ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
Play Offs లోకి ఆర్సిబీ
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement