ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి సంతకంతోనే ఒబామా హెల్త్కేర్ పథకాన్ని రద్దు చేయడం దేశీయ ఫార్మా రంగాన్ని దెబ్బతీసింది. మరోవైపు ఉద్యోగ కల్పనలో అమెరికన్లకే ప్రాధాన్యమన్న వ్యాఖ్యలు దేశీయ ఐటీ రంగాన్ని ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు ఈ రంగాల షేర్లలో భారీ అమ్మకాలకు దిగారు. దీంతో ఎన్ఎస్ఈలో ఐటీ, ఫార్మా ఇండెక్సులు దాదాపు 1-2 శాతం క్షీణించాయి. ఐటీ స్టాక్స్లో మైండ్ట్రీ, టాటా ఎలక్సీ, టెక్ మహీంద్రా, కేపీఐటీ, ఒరాకిల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఐటీ దిగ్గజాలు మాత్రం ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రం స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఇక ఫార్మా షేర్లలో పిరమల్, దివీస్, గ్లెన్మార్క్, డ్విట్స్ ల్యాబ్స్, అరబిందో, కేడిలా హెల్త్, సన్ ఫార్మా, లుపిన్, సిప్లా 2-0.5 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.
అటు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యొక్క రక్షణాత్మక ఆర్థిక విధానాలపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు నెగిటవ్ స్పందించాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో భారత ఈక్విటీ మార్కెట్లలో నష్టాలతో ప్రారంభమైనా..త్వరలోనే కోలుకుని సానుకూలంగా మారాయి. ఒక దశలో సెన్సెక్స్100 పాయింట్లకు పైగా లాభపడి 27,146 ను తాకింది. ముఖ్యంగా మార్కెట్ లో మెటల్ స్టాక్స్ భారీగా లాఢపడుతున్నాయి. ఎన్ఎస్ఇ మెటల్ ఉప ఇండెక్స్ 1.61శా\తం ఎగిసింది. వీటిలో హిందాల్కో, టాటా స్టీల్, జెఎస్డబ్ల్యు స్టీల్, ఒఎన్జిసి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలనార్జిస్తున్నాయి.
ట్రంప్ ఎఫెక్ట్: ఐటీ, ఫార్మా ఢమాల్!
Published Mon, Jan 23 2017 10:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement