బీజేపీ ఎమ్మెల్యే కారులో రూ.12 లక్షలు | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే కారులో రూ.12 లక్షలు

Published Thu, Sep 17 2015 5:27 PM

ఉషా విద్యార్థి(ఫైల్) - Sakshi

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు దొరుకుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఉషా విద్యార్థి వాహనంలో రూ.12 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నగదు స్వాధీనం చేసుకున్న సమయంలో ఎమ్మెల్యే ఉషా విద్యార్థి కారులో లేరు. పాట్నాలోని పాలీగంజ్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

మాజీ సీఎం జితన్ రాం మాంఝీ తనయుడు ప్రవీణ్ మాంఝీ గత ఆదివారం రూ.4.65 లక్షల నగదుతో పోలీసులకు పట్టుబడ్డారు. ఇంటి నిర్మాణం కోసం తమ బంధువులు అప్పుగా తీసుకున్న సొమ్ము అని పోలీసులకు ప్రవీణ్ తెలిపారు.

Advertisement
Advertisement