గర్భిణిపై సర్పంచి కొడుకు అత్యాచారం | Sakshi
Sakshi News home page

గర్భిణిపై సర్పంచి కొడుకు అత్యాచారం

Published Fri, Aug 22 2014 2:24 PM

గర్భిణిపై సర్పంచి కొడుకు అత్యాచారం - Sakshi

మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గర్భిణి అని కూడా చూడకుండా ఓ మహిళపై గ్రామ సర్పంచి కొడుకు అత్యాచారం చేశాడు. ఐదుగురు పిల్లల తల్లి అయిన బాధితురాలు (35) సర్పంచి ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. ఐదారు రోజుల క్రితం సర్పంచి కొడుకు అజయ్ రాజ్పుత్ ఆమెపై అత్యాచారం చేశాడు.

ఈ సంఘటన ఛత్తర్పూర్ జిల్లా బర్త్ గ్రామంలో జరిగిందని నౌగావ్ పోలీసు స్టేషన్ ఇన్ఛార్జి డీడీ ఆజాద్ తెలిపారు. జరిగిన సంఘటనపై ఐదు నెలల గర్భిణిగా ఉన్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడు అజయ్ రాజ్పుత్ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

Advertisement
Advertisement