ఏడాది పాలనపై ధ్వజమెత్తిన కాంగ్రెస్
⇒ ప్రచారంలో దిట్టగా మారిన ప్రధాని
⇒ ఏడాదిగా ఎన్డీయే సర్కారు చేసింది శూన్యం
⇒ నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం
భోపాల్: ఎన్డీయే సర్కారు ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ తన దాడిని కొనసాగిస్తోంది. ఈ ఏడాది కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్కెటింగ్ గురుగా ఎదిగారని ఆ పార్టీ ఎద్దేవా చేసింది.
మోదీ సర్కారు పనితీరు శూన్యమని విమర్శించింది. అయితే మోదీ మాత్రం తన ప్రభుత్వ పనితీరు గొప్పగా ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తింది. ‘పనితీరు శూన్యమైనప్పటికీ వస్తువులను విక్రయించే నేర్పరితనాన్ని మోదీ సంపాదించార ’ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ వ్యాఖ్యానించారు. గత యూపీఏ ప్రభుత్వ పథకాలనే కొత్తగా మలిచి వాటిని తెచ్చిన ఘనత తమదే అన్నట్లుగా మోదీ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.
ఆయన హయాంలో మాంసం ఎగుమతిలో మాత్రమే వృద్ధి నమోదైందని, ఏడాది కాలంలో 15 శాతం ఎక్కువ మాంసం ఎగుమతి అయిందని పేర్కొన్నారు. ఈ విషయంలో గతంలో యూపీఏను మోదీ తప్పుబట్టారని గుర్తు చేశారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్డీయే సర్కారు పూర్తిగా విఫలమైందని, అధికార కేంద్రీకర ణ ఇందుకు కారణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ విమర్శించారు.
లోక్పాల్, సీవీసీ, సీఐసీ, డీఆర్డీవో, ఐసీఏఆర్, సీఎస్ఐఆర్ వంటి అనేక అత్యున్నత సంస్థలకు నేతృత్వం వహించే పోస్టులన్నీ చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయని, 12 సెంట్రల్ యూనివర్సిటీలకు వైస్చాన్సలర్లు కూడా లేరని గుర్తుచేశారు. 76 మంది సంయుక్త కార్యదర్శుల నియామకం చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్ణయాత్మక అధికారం మోదీ ఒక్కరి చేతుల్లోనే ఉండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు.
ప్రధాని మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు ప్రచారం చేస్తూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అలాగే ఫ్రాన్స్కు చెందిన కంపెనీతో రాఫెల్ యుద్ధ విమానాల తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని ఆనంద్ శర్మ తప్పుబట్టారు. ఈ ఒప్పందం నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థను ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.
మార్కెటింగ్ గురు మోదీ
Published Mon, May 25 2015 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement