ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తున్నా: సీఎం చంద్రబాబు | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తున్నా: సీఎం చంద్రబాబు

Published Sun, Apr 23 2017 8:46 PM

ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తున్నా: సీఎం చంద్రబాబు - Sakshi

న్యూఢిల్లీ: బరితెగించిన టీడీపీ ఇసుక మాఫియా 17 మందిని పొట్టనపెట్టుకున్న ఏర్పేడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు స్పందించారు. నీతిఆయోగ్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొనే నిమిత్తం ఆదివారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడి నుంచే తూతూమంత్రపు చర్యలకు ఆదేశాలు జారీచేశారు.

ఇసుక మాఫియా కారణంగా 17 మంది దారుణంగా చనిపోయిన సంఘటనపై సీనియర్‌ అధికారితో విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మునగలపాలెం ఇసుక మాఫియా డాన్‌లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం నేతలు ధనుంజయనాయుడు, చిరంజీవి నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగా ఎమ్మార్వోను సైతం సస్పెండ్‌ చేస్తున్నట్లు చెప్పారు.

అత్యవసర వస్తువుల చట్టం కిందకు ఇసుకను కూడా తీసుకొస్తామని, ఇసుకను నిలువ చేసేవారిపై పీడీ యాక్టు కింద కేసులు పెడతామని, తాగి వాహనాలు నడిపేవారి లైసెన్సులు రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement