బీజేపీ పదాధికారులకు అమిత్ షా నిర్దేశం
కష్టపడే వారే బాధ్యతలు తీసుకోవాలి.. అందరి పనితీరూ పరిశీలిస్తా
ఒకప్పుడు గుజరాత్లో పార్టీ పరిస్థితే ఇప్పుడు తెలంగాణలో ఉంది
అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: పార్టీ పదాధికారులు ఇకపై నెలలో వారం రోజులు గ్రామాల్లోనే గడపాలని, రాత్రి బస కూడా అక్కడే చేయాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్దేశించారు. నేతలెవరూ పార్టీ కార్యాలయానికే పరిమితం కావద్దని, గ్రామ స్థాయికి పార్టీని తీసుకెళ్లాలని సూచించారు. కష్టపడే వారినే పదాధికారులుగా ఉండాలన్నారు. అందరి పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తానని, నెలలో వారం రోజులు దక్షిణాదిలోనే ఉండి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. గురువారం రాత్రి ఆయన పంజాగుట్టలోని సెస్ ఆడిటోరియంలో పార్టీ తెలంగాణ పదాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ.. పార్టీ నేతలకు సూటిగా, స్పష్టంగా సూచనలిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని, దాన్ని అందిపుచ్చుకోవటానికి నేతలు బాగా శ్రమపడాలని పేర్కొన్నారు. 1985లో గుజరాత్లో పార్టీని అధికారంలోకి తేవడానికి చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. వెరసి గుజరాత్ నమూనాను తెలంగాణలో అమలు చేయనున్నట్టు అమిత్ షా స్పష్టం చేశారు.
కొందరు నేతలు వేసిన ప్రశ్నల ఆధారంగా అమిత్ షా చేసిన కీలక సూచనలు ఇలా ఉన్నాయి.
1985లో గుజరాత్లో ఉన్న పరిస్థితే ఇప్పుడు తెలంగాణలో ఉంది. అప్పట్లో అక్కడ బీజేపీకి కేవలం 9 మంది ఎమ్మెల్యేలుండేవారు, తెలంగాణలో ఐదుగురున్నారు. ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణలో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించడాన్ని పరిశీలిస్తే 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.
పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున అక్కడి నుంచి నిధులు కావాలనో, రాష్ట్రానికి ప్రాజెక్టులు కావాలనో అడక్కండి. రాష్ట్రానికి, ప్రజలకు ఏం కావాలో అది ప్రభుత్వం చూసుకుంటుంది. కేంద్రంపై ఆధారపడి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనను విరమించుకోండి. అసలు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్నే మర్చిపొండి.
వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులుండాలా వద్దా అన్నది నేను చూసుకుంటా. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తే అసలు పొత్తుల అవసరమే ఉండదు. వాస్తవానికి నేను పొత్తు విధానానికి వ్యతిరేకిని. పార్టీని మీరు పటిష్టం చేయకపోతేనే పొత్తు ప్రస్తావన వస్తుంది.
ఏడాది పొడవునా పార్టీ కార్యక్రమాలు ఉండేలా కార్యాచరణను సిద్ధం చేయండి. దానికి తగ్గుట్టుగానే కార్యక్రమాలు కొనసాగించండి. వీటిని పరిశీలించేందుకు మూడు నెలలకోమారు ఢిల్లీ నుంచి పరిశీలకులను పంపుతాను. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిశితంగా పరిశీలించండి. ప్రజావ్యతిరేక అంశాలుంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు సంబంధించి తొలుత తెలంగాణలోనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీన్ని సీరియస్గా పరిగణించి పని ప్రారంభించండి.
సంస్థాగతంగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పటిష్టం కావాలి.
నేడు చంద్రబాబుతో అమిత్షా భేటీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్షా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీవర్గాలు తెలిపాయి. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై వారు చర్చించే అవకాశముందని ఆ వర్గాలు చెప్పాయి.
టీఆర్ఎల్డీ విలీనం
భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ విలీనమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో గురువారం టీఆర్ఎల్డీ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ కె.దిలీప్కుమార్ విలీనాన్ని ప్రకటించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఉన్న దిలీప్కుమార్ గత ఎన్నికలకు ముందు టీఆర్ఎల్డీని ఏర్పాటు చేశారు. జాతీయస్థాయిలోని రాష్ట్రీయ లోక్దళ్కు అనుబంధంగా తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ను ఏర్పాటుచేశారు. దిలీప్కువూర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, భువనగిరి లోక్సభా స్థానానికి కూడా టీఆర్ఎల్డీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యూరు.
నెలలో వారం పల్లెల్లోనే..
Published Fri, Aug 22 2014 1:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement