Sakshi News home page

క్షుద్రపూజల కోసం ఆరేళ్ల బాలుడి బలి!

Published Wed, Feb 18 2015 4:57 AM

క్షుద్రపూజల కోసం ఆరేళ్ల బాలుడి బలి! - Sakshi

అచ్చంపేట: పాఠశాలకు వెళ్లిన ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో మంగళవారం ఈ  ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. దాసరి యేసుబాబు, అశ్విని దంపతులకు మహేష్, అశోక్(6) కొడుకులు ఉన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మహేష్ రెండో తరగతి, అశోక్ ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం అన్నదమ్ములిద్దరూ పాఠశాలకు వెళ్లారు. విరామ సమయంలో అశోక్‌ను ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ తీసుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు.
 
 ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మంగళవారం తెల్లవారుజామున అచ్చంపేట పట్టణ శివారులో పాడుబడిన బాలుడు రక్తపుమడుగులో కనిపించాడు. పంది కళేబరంపై మృతదేహం పడి ఉండడంతో క్షుద్ర పూజల కోసమే బాలుడిని బలి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమకు ఎవరితో శతృత్వం లేదని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.  
 

Advertisement
Advertisement