మహబూబ్నగర్ రూరల్: మురికి వాడల్లో అసౌకర్యాల మధ్య నివసిస్తున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూంల నిర్మాణం వరంగా మారినప్పటికీ పాలమూరులో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 2015 జనవరి 18న పట్టణంలో పర్యటించిన సీఎం ఇక్కడి పరిస్థితులకు చలించిపోయారు. పాతపాలమూరు, వీరన్నపేట, పాతతోట వీధులను చుట్టొచ్చిన ముఖ్యమంత్రి అప్పట్లో ఎందరో నిరుపేద కుటుంబాల యజమానులను పలుకరించి రెండు పడకల ఇళ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ అసలు విషయం..
రెవెన్యూ అధికారులు లబ్ధిదారుల ఎంపిక కోసం అనేకసార్లు సర్వేలు చేశారు. వాస్తవానికి ఇల్లు గానీ, ప్లాట్లు గానీ లేని వారిని గుర్తించి వారి పేర్లను లక్కీ డిప్లో వేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల డబుల్ ఇళ్ల కోసం నిర్వహించిన లక్కీ డిప్ వివరాలను పరిశీలిస్తే ఉన్న వారికే ఇళ్లు వచ్చాయి. లేని వారికి అన్యాయం జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా భుజంతట్టి హామీ ఇచ్చిన పాతపాలమూరు కొమ్మూరు చంద్రయ్యకు లక్కీ డిప్లో ఇల్లు లభించలేదు. ఈ విషయంపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. డిప్ నిర్వహించిన అధికారులు ఇళ్లు కూల్చుకొని ఎదురు చూస్తున్న వారికి.. పాతపాలమూరులో ఉన్న వారందరి దరఖాస్తులు స్వీకరించి లక్కీ డిప్లో వేయడంతో నిజమైన అర్హులకు ఇళ్లు మంజూరు కాలేదు. దీంతో చాలామంది అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారుల సర్వేపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఇంతకు సర్వే పారదర్శకంగా నిర్వహించారా.. లేక ప్రజాప్రతినిధుల సిఫార్సులకు తలొగ్గి డిప్లో పేర్లు వేయించారనే విషయం తెలియాల్సి ఉంది.
త్వరలో రీ సర్వే?
ఇదిలాఉండగా డబుల్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల లక్కీడిప్పై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో పాటు ఆందోళనల నేపథ్యంలో లక్కీడిప్లో ప్రకటించిన లబ్ధిదారుల జాబితాపై రీ సర్వే నిర్వహించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్డీఓ లక్ష్మినారాయణ, తహసీల్దార్ ఎంవీ ప్రభాకర్రావులు మరోసారి లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి నిజమైన అర్హులకు డబుల్ ఇళ్లు అందేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదేగనక జరిగితే కొంతలో కొంత పేదలకు న్యాయం జరిగే అవకాశం లేకపోలేదు.
అర్హులకు అన్యాయం
Published Mon, Oct 23 2017 11:52 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Watch Live ఏపీ పోలింగ్ ప్రత్యక్ష ప్రసారం
1500 మీటర్ల విభాగంలో దీక్ష జాతీయ రికార్డు
విమానంలో ల్యాండింగ్గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..
మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మరో బ్యూటీ!..
పిఠాపురంలో మహిళా ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తుంది
మునుపటి కంటే ఈసారి అధిక శాతం ఓటింగ్
కెనడా చర్రితలోనే భారీ చోరీ : 400 కిలోల గోల్డ్, విదేశీ కరెన్సీ భారత సంతతికి చెందిన వ్యక్తి అరెస్ట్
స్వర్ణ పతకాలు నెగ్గిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు అనూష, రష్మీ
మంగళగిరిలో ఓటేసేందుకు వెళ్లిన పవన్ ఓవరాక్షన్
పాముల పుష్ప శ్రీవాణి ఓటు వేశారు
తప్పక చదవండి
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement