సాక్షి, ఖమ్మం: అటవీ శాఖ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగడం లేదని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ చట్టాలపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించి పరిష్కారానికి మార్గాలు చూపాలని కోరారు. పార్లమెంట్లో మంగళవారం ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. పర్యావరణ అనుమతుల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు.
నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా అటవీ శాఖ అలసత్వం వల్ల ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పాలకులు ఈ అంశంపై దృష్టి సారించగలిగితే నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తకావడంతోపాటు జాతీయ ఉత్పత్తి పెరిగి, దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందన్నారు. ఇప్పటికైనా ఈ చట్టాల అమలుకు పూనుకోవాలని, ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. సరిహద్దు రాష్ట్రాలు వద్దు మొర్రో అంటున్నా వారి వాదనను వినిపించుకోకుండా పోలవరం బిల్లును ఆమోదించారన్నారు.
ఏళ్ల తరబడి తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. నదుల అనుసంధానం కోసం సర్ ఆర్థర్ కాటన్ చేసిన ప్రయత్నాలను పొంగులేటి కొనియాడారు. కృష్ణ, గోదావరి, కావేరి నదులపై ప్రాజెక్టులు నిర్మించాలనే సర్ ఆర్థర్కాటన్ చిరకాల కోరికను ప్రస్తుత పాలకులైనా నెరవేర్చాలన్నారు. అలాగే బిందు సేద్యంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానం వల్ల తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించుకుని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
గోదావరి నుంచి తెలంగాణ ప్రాంతానికి సాగునీటి కోసం ఏర్పాటు చేసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై దృష్టి సారించాలని కోరారు. ఈ ప్రాజెక్టులో 30 అడుగుల మేర పూడిక ఉందని, దీని వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. వీలైనంత త్వరగా శ్రీరాంసాగర్లో పూడికతీత కార్యక్రమం చేపట్టాలని, అందుకు సరిపడా నిధులను కేటాయించాలని కోరారు. ప్రస్తుత సీజన్లో వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు బాధితులకు ముందుగానే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వరద బీభత్సంతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక పథకం ఏర్పాటు చేసి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.
అటవీ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టులు ఆలస్యం
Published Wed, Jul 23 2014 2:25 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
మృతులందరిది ఒకే కుటుంబం
అప్పులబాధతో ఆర్ఎంపీ బలవన్మరణం
ఫెడరేషన్ క్రీడల్లో వనజారెడ్డికి బంగారు పతకాలు
శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు
జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
ఉత్సాహంగా సర్కారి కిస్తీ
మేమంటే.. మేమే..
తప్పక చదవండి
- వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది: అబ్బయ్య చౌదరి
- అమిత్ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్కు ఈసీ లేఖ
- రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి
- మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
- హైబ్రీడ్ కార్.. ఒక్కసారికి 2000 కిమీ ప్రయాణం
- బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?
- ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
- టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
- Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement