విద్యుదాఘాతంతో రైతు మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Published Thu, Jul 30 2015 6:31 PM

farmer dies after electric shock in rangareddy district

రంగారెడ్డి: పొలం దగ్గర పనులకు వెళ్లిన ఒక రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం లక్ష్మీగూడ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పాండురంగారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం పొలం దగ్గర వెళ్లిన అతను ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురయ్యాడు.

అయితే, ఉదయం నుంచి అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో అతని మృతి వార్త తెలియలేదు. కాగా, సాయంత్రం అటుగా వెళ్లిన గ్రామస్తులు పాండురంగారెడ్డి మృతదేహాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషంయ తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement