ఆప్ సర్కారు యోచన
♦ భోజనం ధర రూ. 3-5 మధ్య
♦ సీఎం ఆదేశం మేరకు {పతిపాదనల్ని రూపొందించిన డీడీసీ!
♦ క్యాంటీన్ ఏర్పాటుకు రూ.10-15 లక్షల అంచనా వ్యయం
♦ షీలా హయాంలో 30 చోట్ల ‘జన్ ఆహార్’
♦ రూ. 18కే అప్పట్లో భోజనం
♦ ఇప్పుడు అదే బాటలో కేజ్రీవాల్
♦ ఇవి అందుబాటులోకి వస్తే ‘జన్ ఆహార్’ పక్కకే!
సాక్షి, న్యూఢిల్లీ : సామాన్యుడి కోసం నగరంలో త్వరలో క్యాంటీన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తోంది. ఈ క్యాంటీన్ల ద్వారా రూ. 3 నుంచి రూ. 5కు సామాన్యులకు భోజనం అందించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశం మేరకు ఢిల్లీ డైలాగ్ కమిషన్ ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిందని అంటున్నారు.
పేదలకు చౌకగా ఆహారాన్ని అందించడం కోసం షీలాదీక్షిత్ అధికారంలో ఉండగా జన్ ఆహార్ పథకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. ఈ పథకం కింద ఇప్పటికీ 30 చోట్ల భోజనం లభిస్తోంది. జన్ ఆహార్ కింద ఆరు పూరీలు, కూర, పప్పు రూ .18కి విక్రయిస్తున్నారు. ఐదు రూపాయలు అదనంగా చెల్లిస్తే రైతా కూడా లభిస్తుంది. ఆమ్ ఆద్మీ క్యాంటీన్లను ప్రారంభించాలన్న ప్రభుత్వ యోచనతో జన్ ఆహార్ పథకం మూలనపడే సూచనలు కనిపిస్తున్నాయి.
అన్నాడీఎంకే సర్కారు తమిళనాడులో నడిపే అమ్మ క్యాంటీన్లపై అధ్యయనం చేసిన ఢిల్లీ డైలాగ్ కమిషన్ గత నెల 19న ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలిసింది. ఒక్కొక్క క్యాంటీన్ ఏర్పాటుకు రూ. 10 లక్షల నుంచి 15 లక్షల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలుత 10-15 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని డీడీసీ ప్రతిపాదించిందని చెబుతున్నారు. క్రమేణా రాజధానిలో మొత్తం 200 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఆప్ సర్కారు ఆశిస్తోంది. క్యాంటీన్లలో అమ్మే భోజనం గరిష్ట ధర రూ. 5కు మించకూడదని కూడా ఆప్ సర్కారు భావిస్తోంది. ఈ క్యాంటీన్లలో ఉదయం వేళల్లో పూరీ, కూర, పచ్చడి, మధ్యాహ్న సమయంలో అన్నం, పప్పు, రాత్రి రొట్టె, కూర, పప్పు లభిస్తాయి. ఆస్పత్రులతోపాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనాల్లోనూ ఈ క్యాంటీన్లను నెలకొల్పుతారు.
సామాన్యుల కోసం క్యాంటీన్లు
Published Sat, Jul 4 2015 1:01 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement