ఎఫ్‌ఆర్‌బీఎంపై కేంద్రానికి బాబు లేఖ | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్‌బీఎంపై కేంద్రానికి బాబు లేఖ

Published Thu, Oct 13 2016 3:37 PM

Chandrababu Naidu letter to the center On FRBM

 ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్టు (ఎఫ్‌ఆర్‌బీఎంఏ)ను సవరించి, ఏపీకి వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఈ నెల18 నుంచి ఢిల్లీలో జరిగే ఆర్థిక మంత్రుల సమావేశంలో మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వద్ద ఈ మేరకు ప్రతిపాదనలు అందించనున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎంను 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని ఇందులో కోరనున్నారు. కేంద్ర గనుక అనుమతిస్తే అదనంగా రాష్ట్రానికి రూ.3వేల కోట్లు నిధులు రుణంగా సమకూరనున్నాయి. కాగా, ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే లేఖ కూడా రాశారని అధికారులు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement