- పునరుద్ధరించిన టీఎస్ఆర్టీసీ
- హర్షం వ్యక్తంచేసిన తెలుగు ప్రజలు
- తెలంగాణ ముంబై మధ్య 8 బస్సులు
సాక్షి, ముంబై: ముంబైలోని తెలంగాణ ప్రజలకోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్దిపేట బస్సును పునరుద్ధరించింది. గజ్వెల్-ప్రజ్ఞాపుర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును సిద్దిపేట, హైదరాబాద్ల మీదుగా ముంబైకి తిరిగి ప్రారంభించారు. దీనిపై తెలుగు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, సిద్దిపేట నుంచి గురువారం, ముంబై నుంచి శుక్రవారం బస్సు ప్రారంభమైంది. గతంలో మాదిరిగానే బోరివలి, దహిసర్, ఠాణే, పన్వెల్, పుణే, షోలాపూర్, జహీరాబాద్, హైదరాబాద్ల మీదుగా బస్సు సిద్దిపేటకు చేరుకుంటుంది.
మూడు నెలల కిందట వివిధ కారణాల వల్ల ముంబై-సిద్దిపేట ఆర్టీసీ బస్సును నిలిపివేశారు. దీంతో ఓ వైపు రైళ్లలో టిక్కెట్లు లభించకపోవడం, మరోవైపు బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ బస్సును మళ్లీ పునరుద్ధరించడంపై ముఖ్యంగా ముంబైలో నివసించే సిద్దిపేట, జహీరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
వేసవి సెలవులకు ముందే ఈ బస్సు ప్రారంభం కావడంతో స్వగ్రామాలకు వెళ్లాలనుకునే అనేక మందికి బస్సు ఊరటగా మారనుందని చెప్పవచ్చు. ఇకపై ఈ బస్సు ప్రతి రోజు నడుస్తుందని టీఎస్ఆర్టీసీ ముంబై అధికారి బి. లక్ష్మయ్య తెలిపారు. మరోవైపు ఠాణే నుంచి వనపర్తి బస్సును కుర్లా నుంచి ఇటీవలే ప్రారంభించినట్టు చెప్పారు. ఈ బస్సు కూడా ముందు కుర్లా అనంతరం ఠాణే, పన్వెల్ల మీదుగా వనపర్తికి వెళ్తుందని ఆయన చెప్పారు.
ముంబై నుంచి తెలంగాణకు ఎనిమిది బస్సులు
ముంబై నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వివిధప్రాంతాలకు ప్రస్తుతం ఎనిమిది టీఎస్ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. గతంలో ఈ సంఖ్య దాదాపు మూడింతలు ఉండేది. పరెల్, కుర్లా, గోరేగావ్, బోరివలి, ఠాణే, భివండీ తదితర ప్రాంతాల నుంచి సుమారు 20 కిపైగా బస్సులు నడిచేవి. కేవలం పనెల్ నుంచి ఎనిమిది బస్సులు నడిచేవి. అయితే గత కొన్ని సంవత్సారాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా టిక్కెట్ చార్జీల పెరగడం, ఇతర కారణాల వల్ల అనేక బస్సు సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం కుర్లా నుంచి నాలుగు, బోరివలి నుంచి రెండు, గోరేగావ్, పరెల్ నుంచి ఒక్కో బస్సు నడుస్తోంది.
వీటిలో కుర్లా నుంచి వయా ఠాణే మీదుగా వనపర్తి, మమ్తాబాద్, మరిక్కల్ (కొండాపూర్)లతోపాటు కుర్లా-నారాయణపేట బస్సు ఉంది. అదే విధంగా బోరివలి నుంచి కరీంనగర్తోపాటు తాజాగా ప్రారంభమైన సిద్దిపేట బస్సు, పరెల్ నుంచి ధర్మపురి-లక్షెట్టిపేట, గోరేగావ్-నార్కట్పల్లి బస్సులున్నాయి. కుర్లా, పరెల్, బోరివలి, గోరేగావ్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరినప్పటికీ కొన్ని బస్సులు వయా ఠాణే మీదుగా మరి కొన్ని బస్సులు సైన్ మీదుగా పన్వెల్ పుణే మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో మరి కొన్ని బస్సులను పెంచాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా భివండీ, ఠాణే ప్రాంతాల నుంచి జగిత్యాల మార్గంలో బస్సులు ప్రారంభించాలని కోరుతున్నారు.
మళ్లీ ‘సిద్దిపేట టు ముంబై ’ బస్సు
Published Fri, Feb 27 2015 11:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
భారీగా పట్టుబడిన నగదు
మహిళపై అత్యాచారం: కేసు నమోదు
దేశానికి మోదీ నాయకత్వం అవసరం
బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదు
మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం
మహిళలే నిర్ణేతలు
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement