మిథాలీ రాజ్ డబుల్ ధమాకా! | Sakshi
Sakshi News home page

మిథాలీ రాజ్ డబుల్ ధమాకా!

Published Sun, Nov 12 2017 5:13 PM

Double delight for Mithali Raj at Indian Sports Honours - Sakshi

ముంబై:భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కు రెండు పురస్కారాలు దక్కాయి. విరాట్ కోహ్లి ఫౌండేషన్, వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకాలు ఆధ్వర్యంలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ వేడుకలో మిథాలీ రాజ్ రెండు అవార్డులను దక్కించుకున్నారు. ఈ ఏడాది అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్న మిథాలీ రాజ్.. భారత జట్టును మహిళా ప్రపంచ కప్ ఫైనల్ వరకూ తీసుకెళ్లారు.

దీనిలో భాగంగా 'స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్' పురస్కారంతో పాటు, స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు కూడా మిథాలీకి దక్కింది. ఈ విషయాన్ని మిథాలీ రాజ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఆ రెండు అవార్డులను పట్టుకుని దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

A post shared by Mithali Raj (@mithaliraj) on

Advertisement
Advertisement