అంబటి ఓటు గల్లంతు..! | Sakshi
Sakshi News home page

అంబటి ఓటు గల్లంతు..!

Published Sat, Feb 3 2018 1:42 AM

ysrcp leader ambati rambabu fires on kodela and followers - Sakshi

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తన ఓటు గల్లంతయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అంబటి గత ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. సత్తెనపల్లిలో తనతో పాటు తన భార్య, ముగ్గురు కుమార్తెలకు ఓటు హక్కు ఉండగా, ప్రస్తుతం తన కుటుంబంలో కేవలం ఒక్క చిన్న కుమార్తెకు మాత్రమే ఓటు హక్కు ఉంచి, మిగిలినవన్నీ జాబితా నుంచి తొలగించారని అంబటి తెలిపారు. దీనివల్ల తాను ఉంటున్న గుంటూరులో, తాజాగా సత్తెనపల్లిలో కూడా ఓటు లేకుండా పోయిందని చెప్పారు.

శుక్రవారం సత్తెనపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉందని అంబటి వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement