సర్కారూ నాసిరకమే: ఉత్తమ్‌  | Sakshi
Sakshi News home page

సర్కారూ నాసిరకమే: ఉత్తమ్‌ 

Published Sun, Sep 24 2017 1:35 AM

uttam kumar reddy about womans bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నో పోరాటాల ఫలితంగా, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కరుణతో ప్రత్యేక తెలంగాణ వచ్చిందని..కానీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని నాసిరకంగా పాలిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రతి అంశంలో నాసిరకంగానే పాలన ఉందని, చివరకు మహిళలకు ఎంతో గౌరవంగా ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలుకూడా నాసిరకంగా ఇచ్చి అవమానించారన్నారు.

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్‌ బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి నుంచి మహిళలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఇప్పటివరకు తెలంగాణలో మహిళా మంత్రి లేకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ హయాం లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉండేదని, భవిష్యత్తులో కూడా వారికి ప్రాధాన్యమిచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహిళా బిల్లు కోసం సంతకాల సేకరణ చేయడం అభినందనీయమన్నా రు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement