సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో త్రిముఖ పోటీ జరిగినట్లితే బీజేపీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పాకిస్తాన్పై విమాన దాడులు కూడా పార్టీకి కలిసి రానున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతోన్న పొత్తుకు కాంగ్రెస్ సుముఖంగా లేకపోవడంతో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలి బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా. రెండు పార్టీల ఓటు బ్యాంకు ఒకటే కనుక ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తే బీజేపీకి గట్టి పోటీ ఇస్తాయని భావిస్తున్నారు. ఆప్తో జత కట్టినట్లయితే తమ పార్టీ కోలుకునే అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని కాంగ్రెస్ భయపడుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని ఢిల్లీ కాంగ్రెస్ అ«ధ్యక్షరాలు షీలాదీక్షిత్ ప్రకటించినప్పటికీ పార్టీ ఈ విషయంపై పునరాలోచిస్తోందన్న సూచనలు వెలువడుతున్నాయి. ఢిల్లీ, గరుగ్రామ్లో మే12న, నోయిడా, ఘాజియాబాద్లో లోక్సçభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఢిల్లీలో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 16 మొదలుకానుంది. ఏప్రిల్ 23న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ఏప్రిల్ 26 వరకు అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు. 12న పోలింగ్ జరుగుతుంది. ఈ సారి ఎన్నికల్లో 1,38,46,482 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 62,10,058 మంది మాహిళలు, 76,35,786 మంది పురుషులు, 638 మంది ఇతరులు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కోసం ఢిల్లీలో 2,606 చోట్ల 13,816 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏడింటికి ఏడు సీట్లను గెలిచింది.
న్యూఢిల్లీ: గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ న్యాయవాది మీనాక్షీ లేఖి గెలిచారు. ఈ సారి ఆప్ ఇక్కడి నుంచి బ్రిజేష్ను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ మీనాక్షి లేఖిని గానీ, క్రికెటర్ గౌతం గౌతంగంభీర్ను గానీ నిలబెట్టవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ మాజీ ఢిల్లీ అధ్యక్షుడు అజయ్మాకెన్కు టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి.
చాందినీచౌక్: గత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి డా. హర్షవర్థన్ గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ సారి ఆప్ ఇక్కడి నుంచి పంకజ్ గుప్తాను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఈ సారి విజయ్ గోయల్కు గానీ విజేందర్గుప్తాకు గానీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్, జేపీ అగర్వాల్, హరూన్ యూసఫ్ల పేర్లు వినిపిస్తున్నాయి.
దక్షిణ ఢిల్లీ: గత ఎన్నికల్లో ఇఈ స్థానం నుంచి రమేష్ బిధూడీ గెలిచారు. ఆప్ ఈసారి ఇక్కడి రాఘవ్ చద్దాను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ ఇక్కడి నుంచి యోగానందశాస్త్రికి గానీ చత్తర్సింగ్కు గానీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ మరోమారు రమేష్ బి«ధూడీని బరిలోకి దింపవచ్చు లేదా మాజీ ఎమ్మెల్యే రామ్వీర్సింగ్ బిధూడీని నిలబెట్టవచ్చు.
తూర్పు ఢిల్లీ: గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మహేష గిరి గెలిచారు. ఆప్ ఈçసారి అతిïషిని అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఇక్కడి నుంచి డా.హర్షవర్ధన్ను, కాంగ్రెస్ డా. ఎకెవాలియాను గానీ అర్విందర్ సింగ్ లవ్లీని గానీ నిలబెట్టవచ్చని అంటున్నారు.
ఈశాన్య ఢిల్లీ: గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మనోజ్తివారీ గెలిచారు. ఆప్ ఈ సారి ఇక్కడి నుంచి దిలీప్ పాండేను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారీని గానీ, మాజీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్ను గానీ అభ్యర్థిని చేయవచ్చు. కాంగ్రెస్ నుంచి కీర్తి ఆజాద్కు రేసులో ఉన్నారు.
వాయవ్య ఢిల్లీ: గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఉదిత్ రాజ్ గెలిచారు. ఆప్ ఈ సారి ఇక్కడి నుంచి గూగన్ సింగ్ను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ దుష్యంత్కుమార్ గౌతంకు టికెట్ ఇస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి రాజ్కుమార్,రాజేష్ లిలోఠియా, జైకిషన్ల పేర్లు వినిపిస్తున్నాయి.
పశ్చిమ ఢిల్లీ: గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పర్వేష్ సింగ్ వర్మ గెలిచారు. ఆప్ ఇక్కడ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. బీజేపీ మరోమారు వర్మను నిలబెట్టవచ్చని, కాంగ్రెస్ మహాబల్ మిశ్రా, దేవేందర్ యాదవ్ల పేర్లు పరిశీలిస్తోంది.
త్రిముఖపోటీతో ఎవరికి లాభం?
Published Tue, Mar 12 2019 7:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
తప్పక చదవండి
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
Advertisement