సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబు ఏపీలో ప్రజాస్వామ్యం లేకుండా ఎమర్జన్సీ అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎం కాన్వాయ్ను అడ్డుకుని పోర్టు పోలీసు స్టేషన్లో ఉన్న బీజేపీ నేతలు, మహిళా కార్పోరేటర్లను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక వీధి రౌడీలా ప్రవర్తించే ధోరణిని బీజేపీ ఖండిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి తన తీరును మార్చుకోవాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలతో ఆటలాడితే చేతులు కాల్చుకుంటారని, టీడీపీ నేతలు తగిన ప్రతిఫలం పొందుతారని అన్నారు. టీడీపీ బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్కు సోము వీర్రాజు హెచ్చరిక చేశారు.