రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్‌  | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్‌ 

Published Sun, Aug 25 2019 3:56 PM

AP CM YS Jagan Mohan Reddy To Visit Delhi Tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. ఉదయం 7:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు.  సీఎం జగన్‌ ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 

రాష్ట్రాల్లో నక్సలిజం సమస్యపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సారథ్యంలో సమావేశం జరుగుతుంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎం లు, ఇతర కీలక పోలీసు అధికారులు దీనిలో పాల్గొంటారు. మన రాష్ట్రంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న నక్సలిజం సమస్యపై చర్చ జరగనుంది. సాయంత్రం వరకూ ఈ సమావేశం కొనసాగుతంది. మంగళవారం ఉదయం బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్  తిరిగి విజయవాడ చేరుకుంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement