► ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై వెంకయ్య నాయుడు
► విస్తృత ప్రయోజనాల కోసం అంగీకరించా
► విలేకర్లతో ఇష్టాగోష్టి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా తన పేరు ప్రకటించాక మీడియాలో విస్తృతంగా వచ్చిన ఊహాగానాలకు ఎం. వెంకయ్య నాయుడు తెరదించారు. తనను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించడానికి ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలను గట్టిగా తోసిపుచ్చారు. ‘అలా అనడం తప్పు.. మూర్ఖత్వం.. ప్రధాని మోదీ సూచన మేరకు, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరించాను’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన ఆదివారమిక్కడ తెలుగు మీడియా ప్రతినిధులతో తన మనసులో మాటలను విప్పిచెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై వెంకయ్య ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
ఏదేదో రాశారు..
నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటినుంచి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల్లో విపరీతంగా రాశారు. నాకు ఉప రాష్ట్రపతి పదవిపై ఆసక్తి లేదని, పక్కకు తప్పించడానికే రాజ్యాంగ పదవివైపు నెట్టారని.. ఏదేదో రాశారు. నేను యుక్తవయసు నుంచే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. రాజకీయ జీవితాన్ని ఆస్వాదిస్తూ పూర్తిగా రాజకీయ జీవినైపోయాను. స్వభావరీత్యా ప్రజల మధ్య ఉండడం నాకిష్టం. స్నేహితులతో, రాజకీయ కార్యకర్తలతో కలసి సినిమాలకు, హోటళ్లకు వెళ్లడం ఇష్టం. ప్రొటోకాల్ తరహా పదవులకు స్వభావసిద్ధంగానే వ్యతిరేకం.
అమిత్ షా నచ్చజెప్పారు..
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయి. కొంద రి పేర్లు సూచించమని నన్నూ అడిగితే కొన్ని పేర్లు చెప్పాను.. అయితే చాలా మంది సీని యర్లు మీ పేరు సూచిస్తున్నారని, అందుకు అంగీకరించాలని అమిత్ షా నాతో చెప్పారు.. రాజకీయ కార్యకర్తను కావడం వల్ల రాజ్యాంగ పదవులకు తగనేమోనని తొలుత సంశయిం చాను. అయితే అమిత్ షా నచ్చజెప్పారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేని పరిస్థితుల్లో విస్తృత ప్రయోజనాల కోసం అంగీకరించాలని కోరారు. రాజకీయ అనుభవమున్న మీరే సరైన అభ్యర్థిగా పార్టీ భావిస్తోందని, దీనిపై మోదీతో మాట్లాడమన్నారు.. తర్వాత మోదీతో చర్చించాను. ఆయన సూచనపై విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరించాను.
సామాజిక సేవ చేయాలనుకున్నాను..
నేను మోదీ కేబినెట్లో చేరినప్పటినుంచి ఒక కోరిక ఉండేది.. మోదీ 2019 లోక్సభ ఎన్నికల్లో మళ్లీ గెలవాలని.. ఆ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుని జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్ బాటలో సామాజిక సేవ చేయాలనుకున్నాను.
ఇబ్బందికరమే
రాజకీయాల్లో 40 ఏళ్లు క్రియాశీలకంగా ఉన్న తర్వాత రాజ్యాంగ పదవివైపు వెళ్లడానికి ఎవరైనా ఇబ్బంది పడడం సహజమే. ఎమర్జెన్సీ సమయంలో అసలైన రాజకీయాలు తెలుసుకున్నా. యుక్త వయసులోనే పార్టీ నాకు అన్నీ ఇచ్చింది. నేను అత్యంత అదృష్టవంతుణ్ని.
1971లో జరిగింది మరచిపోవద్దు
1971లో భారత్తో యుద్ధంలో ఏం జరిగిందో మరచిపోవద్దని వెంకయ్యనాయుడు పాక్ను హెచ్చరించారు. ఆదివారమిక్కడ కార్గిల్ యుద్ధ అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ నిర్వహించిన కార్గిల్ పరాక్రమ్ పరేడ్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దక్షిణాది వ్యక్తికి ఇవ్వాలి!: మోదీ
ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరించాలని మోదీ.. వెంకయ్యను కొన్ని కారణాలతో ఒప్పించినట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రపతి ఉత్తరాదికి చెందిన క్రియాశీల రాజకీయాల్లోలేని దళితుడు కావడం వల్ల ఉప రాష్ట్రపతి పదవి దక్షిణాదికి చెందిన వ్యవసాయ నేపథ్యమున్న వ్యక్తికి దక్కాలి అని మోదీ.. వెంకయ్యతో జరిపిన భేటీలో చెప్పారు. వెంకయ్య సుదీర్ఘ రాజ కీయ అనుభవం బీజేపీకి మెజారిటీ లేని రాజ్యసభలో సభా వ్యవహారాలను సజావుగా సాగిం చడానికి దోహదపడుతుందన్నారు. మీ పేరును చాలామంది సీనియర్ నేతలు సూచించారని ఆయన వెంకయ్యతో అన్నారు’ అని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
మోదీ చెబితే ఒప్పుకున్నా
Published Mon, Jul 24 2017 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement