29న విద్యార్థులతో మోదీ ‘పరీక్షా పే చర్చ | Sakshi
Sakshi News home page

29న విద్యార్థులతో మోదీ ‘పరీక్షా పే చర్చ

Published Wed, Jan 9 2019 2:15 AM

PM Modi to be Back With Pariksha pe Charcha on Jan 29 - Sakshi

న్యూఢిల్లీ: పరీక్షల సీజన్‌ వచ్చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఒత్తిడిని అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చ’పేరుతో వారితో నేరుగా ముచ్చటించనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలోని తల్కతోర స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు Myఎౌఠి.జీnలో విద్యార్థు లు పేర్లు నమోదు చేసుకోవల్సిందిగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే 9, 10, 11, 12 తరగతులు చదువుతున్న వారితో పాటు గ్రాడ్యుయేట్, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులే ఇందుకు అర్హులని ఆ శాఖ తెలిపింది. అందులో ఎంపికైన విద్యార్థులతోనే ప్రధాని ముచ్చటిస్తారు. విద్యార్థులతోపాటుగా వారి తల్లిదండ్రులు, టీచర్లతో ఆయన మాట్లాడనున్నారు. గతేడాది జనవరి 29న మోదీ ‘పరీక్షా పే చర్చ’పేరుతో దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులతో పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించడం ఎలా అనే అంశంపై ముచ్చటించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement