టీఆర్‌ఎస్ తప్పుడు హామీలతోనే వలసలు | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ తప్పుడు హామీలతోనే వలసలు

Published Thu, Jul 7 2016 3:03 AM

టీఆర్‌ఎస్ తప్పుడు హామీలతోనే వలసలు - Sakshi

ఎంపీ నంది ఎల్లయ్య

 సాక్షి, న్యూఢిల్లీ :
ఏఐసీసీ నుంచి సరైన మార్గదర్శనం లేకపోవడం, స్థిరమైన సంప్రదింపులు లేకపోవడంతో పాటు అధికార పార్టీ తప్పుడు హామీల వల్ల రాష్ట్రంలో తమ పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌కు వలస వెళుతున్నారని కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య పేర్కొన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ పరిస్థితి కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో దెబ్బతినడానికి కారణమవుతోందని అన్నారు. ‘ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. 1984లో బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలోపేతం కావడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. ఏఐసీసీ నుంచి బాధ్యతాయుతమైన నాయకులను రెండు నెలలకోసారి పది జిల్లాలకు పంపాలి. వారు పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు చర్చించి పరిస్థితిని అధిష్టానానికి వివరించాలి..’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement