- డీఆర్డీవోలో ఉన్నపుడు భవనం చుట్టూ ఉండే ప్రహరీపై గాజు పెంకులు పెడదామని సహచరులు సూచిస్తే... పక్షులకు గాయాలవుతాయని కలాం అంగీకరించలేదు.
- డీఆర్డీవోలో సహచరుడొకరు పిల్లలను ఎగ్జిబిషన్కు తీసుకెళతానని చెప్పి వాగ్దానం చేసి పని ఒత్తిడిలో మర్చిపోయారు. కలాం స్వయంగా తానే సహచరుడి పిల్లలను ఎగ్జిబిషన్కు తీసుకెళ్లారు.
- రాష్ట్రపతి అయ్యాక తొలిసారిగా కేరళకు వెళ్లిన కలాం తిరువనంతపురంలో రాజ్భవన్కు ఆహ్వానించిన వారిలో రొడ్డుపక్కనుండే ఓ చిన్న హోటల్ యజమాని కూడా ఉన్నారు. శాస్త్రవేత్తగా అక్కడ పనిచేసిన కాలంలో కలాం ఆ చిన్నిహోటల్లోనే భోజనం చేసేవారు. ఏళ్ల తర్వాత కూడా ఆ హోటల్ యజమానికి గుర్తుపెట్టుకొని రాజ్భవన్కు ఆహ్వానించారు తన మూలాలను ఏనాటికీ మరువని మహామనిషి.
- అది 2002. చెన్నైలో అన్నా యూనివర్సిటీలో కలాం తనకెంతో ఇష్టమైన పని చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ప్రధాని వాజ్పేయి నుంచి ఫోన్. క్లాస్రూములో ఉన్నందువల్ల ఫోన్ను రిసీవ్ చేసుకోలేకపోయారు. బయటికొచ్చాక ప్రధానికి కాల్ చేశారు. వాజ్పేయి... ‘రాష్ట్రపతి పదవి చేపడతారా?’. గంట సమయం అడిగారు కలాం.
- ఈలోగా హితులు, శ్రేయోభిలాషులు, మిత్రులతో మాట్లాడారు. 60 శాతం మంది బాగుంటుందని చెబితే, 40 శాతం వద్దన్నారు. మెజారిటీ వైపే మొగ్గారు కలాం. ఎందుకో తెలుసా... రాష్ట్రపతి అయితే దేశం గురించి, విద్య గురించి, యువత గురించి తన ఆలోచనలను పంచుకోవడానికి ఓ పెద్ద వేదిక దొరుకుతుందనేది ఆయన భావన.
- కలాం ప్రతిరోజూ 250-400 మంది దాకా పిల్లలను కలిసేవారు. ఆయన ప్రమాణ స్వీకారానికి సైతం దేశం నలుమూలల నుంచి 100 మంది చిన్నారులను ఆహ్వానించారు.
- పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే... ‘ఎందుకో జరగలేదంతే’ అనేది కలాం సమాధానం. ఇంత పెద్ద కుటుంబంలో (ఐదుగురు అబ్బాయిలు, ఒక సోదరి) ఒక్కరు పెళ్లి చేసుకోకపోతే నష్టమేంటి. వీరిలో చాలామందికి నేను అండగా ఉన్నాను. బంధువులతో టచ్లో ఉంటాను. ఎప్పుడూ ఒంటరితనం ఫీలవ్వలేదు’ అని చెప్పేవారయన.
- రాష్ట్రపతిగా కలాం ప్రమాణ స్వీకారానికి 64 మంది బంధువులు వచ్చారు. వారందరి ప్రమాణ, బస ఏర్పాట్లకు ఖర్చును ఆయనే పెట్టుకున్నారు.
- కలాం శాఖాహారి. 1950లో తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో స్కాలర్షిప్తో చదువుకున్నారు. స్కాలర్షిప్ కింద వచ్చే డబ్బుతో మాంసం, చేపలు తినడం అయ్యే పనికాదని మానేశారు. ‘ఆర్థిక పరిస్థితులే నన్ను శాఖాహారిని చేశాయి. అయితే నాకు అదే నచ్చడంతో అలా శాఖాహారిగానే ఉండిపోయాను’ అని ఒక సందర్భంలో చెప్పారు.
- కర్ణాటక సంగీతం వినడం ఆయనకు ఎంతో ఇష్టం. ‘ఎందరో మహానుభావులు’ అనే త్యాగరాజ కీర్తనను అమితంగా ఇష్టపడేవారు. ‘హైదరాబాద్లో ఉన్నపుడు వీణ నేర్చుకున్నాను. మేడమ్ కల్యాణి అని గొప్ప టీచర్’ అని ఒకసారి గుర్తుచేసుకున్నారాయన.
గాజుపెంకులు పెట్టొద్దన్నారు..
Published Tue, Jul 28 2015 9:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement