నెల్లూరులో చిక్కిన హైదరాబాదీలు
పట్టుబడిన నలుగురిలో ఒకరైన రవూఫ్పై ఇప్పటికే పలుకేసులు
కేసు ఆదాయపుపన్ను శాఖకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ఓ స్థలానికి సంబంధించి జీపీఏ చేసుకోవడానికి నెల్లూరు వెళ్లిన నలుగురు హైదరాబాదీలను అక్కడి పోలీసులు గురువారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.54 కోట్ల విలువైన కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తం దొరకడంతో కేసును ఆదాయపుపన్ను శాఖకు అప్పగించారు. నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తికి నగరంలోని కోకాపేట ప్రాంతంలో ఏడెకరాల భూమి ఉంది. దీన్ని ఖరీదు చేయడానికి సిద్ధమైన ఐదుగురు సిటీ రియల్టర్లు నాలుగు నెలల క్రితం కొంత మొత్తం చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారు. యజమాని నుంచి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చేయించుకునే నిమిత్తం హైదరాబాద్ నుంచి వెళ్లిన నలుగురు రియల్టర్లు నెల్లూరులోని మినర్వా హోటల్లో బస చేశారు.
ఈ నేపథ్యంలోనే... సదరు హోటల్లో భారీ మొత్తం నోట్ల మార్పిడి జరుగుతోందంటూ అక్కడి పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు గురువారం సాయంత్రం ఆ హోటల్పై దాడి చేసి రియల్టర్లు బస చేసిన గదిలో తనిఖీలు చేశారు. అక్కడ రూ.1,54,48,000 విలువైన కొత్త రూ.2 వేల నోట్లతో పాటు మరో రూ.39 లక్షలకు చెందిన డిమాండ్ డ్రాఫ్ట్లు దొరికాయి. కోకాపేటలోని స్థలానికి చెందిన అగ్రిమెంట్లు, ఇతర పత్రాలు సైతం వీరివద్ద లభించాయి. ఇంత భారీ మొత్తంలో కొత్త నోట్లు ఎక్కడ నుంచి వచ్చాయనే అంశాన్ని పోలీసులు రియల్టర్లను ప్రశ్నించారు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నగదుతో పాటు నలుగురినీ ఆదాయపుపన్ను శాఖకు అప్పగించారు.
వీరు వినియోగించిన వాహనంపై తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. రియల్టర్లు ఎంఏ రవూఫ్, ఎం.శ్రీపాల్రెడ్డి, బి.శ్రావణ్కుమార్, మహ్మద్ అబ్దుల్ ఖాలేద్గా గుర్తించారు. వారిలో రవూఫ్ సైదాబాద్కు చెందిన వారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దానికి ప్రతీకారంగా నగరంలో చోటు చేసుకున్న మాణిక్ ప్రభు మెడికల్ హాల్ యజమాని హత్య, 2003 మార్చి 26న జరిగిన గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్పాండ్య హత్య, గుజరాత్ కుట్ర కేసుల్లో అరెస్టు అయ్యాడు. ఆయనపై న్యాయస్థానంలో ఈ కేసులన్నీ వీగిపోయాయి. సుదీర్ఘకాలం గుజరాత్లోని సబర్మతి జైలులో ఉండి వచ్చిన రవూఫ్ ఆపై సైదాబాద్లో ఓ కార్యాలయాన్ని స్థాపించి రియల్టర్గా మారాడు. 2011లో అఫ్జల్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ ఫైనాన్సియర్ను బెదిరించిన ఆరోపణలపై స్థానిక ఠాణాలో మరో కేసు సైతం నమోదైంది.
రూ.1.54 కోట్లు.. అన్నీ 2 వేల నోట్లే
Published Sat, Dec 17 2016 3:56 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement