- అవసరమైతే ఈసేవా కేంద్రం రద్దు చేస్తాం..
- డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం వివరాల నమోదు ఫీజుపై సీజీజీ స్పష్టీకరణ
- రూ.20కి మించి తీసుకుంటే 1100కు ఫిర్యాదు చేయాలని సూచన
- దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటాచలం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా ఈసేవా/మీసేవా కేంద్రాల్లో ఆధార్, బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకునే విద్యార్థుల నుంచి ప్రాసెస్ ఫీజు కింద రూ.20కు మించి వసూ లు చేయడానికి వీల్లేదని సెంటర్ ఫర్ గుడ్ గవర్నె న్స్(సీజీజీ) స్పష్టం చేసింది. ఈసేవా/ మీ సేవా కేం ద్రాల్లో విద్యార్థుల నుంచి ప్రాసెస్ ఫీజు కింద రూ. 50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు అందాయి. విషయాన్ని ఉన్నత విద్యా మండలి అధికారులు సీజీజీకి తెలియజేశారు. ప్రాసెస్ ఫీజు రూ.20కి మించి వసూలు చేయడానికి వీల్లేదని, ఏదైనా కేం ద్రం వారు అంతకుమించి వసూలు చేస్తే 1100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిం చారు. అవసరమైతే ఆ ఈసేవా/మీసేవా కేంద్రాన్ని రద్దు చేస్తామని సీజీజీ అధికారులు తెలిపారు.
24 ప్రభుత్వ కాలేజీల్లోని హెల్ప్లైన్ కేంద్రాల్లోనూ విద్యార్థులు బుధవారం నుంచి ఉచితంగా ప్రాసెస్ చేసుకునేలా చర్యలు చేపట్టామని డిగ్రీ ఆన్లైన్ సర్వీ సెస్ తెలంగాణ (దోస్త్) ప్రవేశాల కన్వీనర్ ప్రొ. వెంకటాచలం చెప్పారు. వాటిలో బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. 14 కాలే జీలు కోర్టును ఆశ్రయించాయని, వాటిలో మాత్రం యాజమాన్యాలే ప్రవేశాలు చేపట్టుకుంటాయని తెలిపారు. తాము ఆన్లైన్ ప్రాసెస్ చేసే 24 హెల్ప్ లైన్ కేంద్రాల వివరాలను దోస్త్ వెబ్ సైట్లో పొంద వచ్చన్నారు. మరో 22 కాలేజీలు ఆన్లైన్ ప్రవేశాల జాబితాలో ఉన్నా, అవి కూడా సొంతంగా ప్రవేశా లు చేపట్టుకునేందుకు కోర్టును ఆశ్రయించాయని, వాటిలో ప్రవేశాలు కోర్టు తీర్పునకు లోబడి ఉంటా యన్నారు. ఆ కాలేజీల వివరా లను చూసుకొని ఆప్షన్లు ఇచ్చుకో వాలన్నారు. వర్సిటీల్లోని హెల్ప్లైన్ కేంద్రా ల్లో ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలన్నారు.
దరఖాస్తు చేసుకునే విధానం ఇదీ..
విద్యార్థులు మొదట దోస్త్ వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా రూ.100 చెల్లించాలి. వారి మొబైల్కు దోస్త్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. ఆ తర్వాత ఈసేవా/ మీసేవా/24 హెల్ప్లైన్ కేంద్రాలకు వెళ్లి ఆధార్, బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయించు కోవాలి. నమోదు తర్వాత అక్కడ దోస్త్ టోకన్ నం బరు ఇస్తారు. ఆ సమీపంలోని వర్సిటీలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రంలో నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత దోస్త్ యూజర్ఐడీ, పాస్వర్డ్, టోకన్ నంబరును ఉప యోగించి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
అదనంగా వసూలు చేస్తే చర్యలే..
Published Thu, May 25 2017 12:10 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పెట్టుబడుల పేరుతో లక్షల వంచన
పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలి
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
పాడి రైతులు లబ్ధి పొందాలి
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కామేశ్వర రావు ప్రమాణం
గురుకులాల్లోనే ఉపాధ్యాయులు బస చేయాలి
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతి
బావిలో పూడిక తీస్తూ నీట మునిగి మృతి
నన్ను గెలిపిస్తే సమస్యలపై స్పందిస్తా
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
తప్పక చదవండి
- రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
- 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
- రోహిత్, విరాట్ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
- శుబ్మన్ గిల్తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- న్యూయార్క్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
- తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
- TG: గవర్నర్కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
Advertisement