♦ ‘హోదా’పై అవగాహన కల్పించడంలో సీఎం, మంత్రులు విఫలం
♦ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజం
సాంబమూర్తినగర్ (కాకినాడ): రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. బుధవారం కాకినాడలో విలేకరుల తో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో మేలు చేస్తుండగా సీఎం చంద్రబాబు అవన్నీ తామే చేసినట్లు చెప్పుకోవడం బాధాకరమన్నారు. చిన్నారులకు టీకాలు అందించే ‘మిషన్ ఇంద్ర ధనుష్’ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానికి సముచిత స్థానం ఇవ్వకపోవడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తామే రాష్ట్రంలో ప్రచారం చేసుకోవాలని సంకల్పించామని, ఇందుకు మీడియా సహకరించాలని వీర్రాజు కోరారు.
‘హోదా’పై అవగాహన కల్పించడంలో విఫలం..
ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించడంలో ముఖ్యమంత్రి, మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ అభివృద్ధి జరగాలని, ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితం కారాదని అభిప్రాయపడ్డారు.ఇటీవల ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. మోదీ ప్రభుత్వం నూతన రాష్ట్రమైన ఏపీకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చేందుకు కేంద్రం రూ.24 వేల కోట్లతో ఎన్టీపీసీ ద్వారా విశాఖలో విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో రూ.6వేల కోట్లతో సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు చర్యలు చేపడుతోందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీర్రాజు!
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నిక దాదాపు ఖాయమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిసెంబర్లో రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు, నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీ అధ్యక్షుడిగా విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రస్తుతం కొనసాగుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ కోసం చురుకుగా పనిచేసిన వీర్రాజు అభ్యర్థిత్వాన్ని నేతలు ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వీర్రాజు పేరును ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
Published Thu, Oct 29 2015 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
హోం ఓటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ఆదివారం రాహుల్ గాంధీ..
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం....
రాహుల్గాంధీ సభను విజయవంతం చేయండి
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
సై.. అంటే సై!
మహిళలే నిరే్ణతలు
ఆదివారం రాహుల్ గాంధీ..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement