అక్రమంగా విత్తనాలు నిల్వ చేసిన వారిపై చర్యలేవీ ?
కేసును పోలీసులకు అప్పగించామంటున్న వ్యవసాయ శాఖ అధికారులు
మరికొందరు అక్రమార్కులకు ఊతంగా అధికారుల వైఖరి
వరంగల్ రూరల్ : వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన వరంగల్ రూరల్ జిల్లాలో రైతన్నలు దగా పడుతూనే ఉన్నారు. నకిలీ విత్తనాలు, అక్రమ నిల్వలతో రైతులను మోసం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మోసం చేసేందుకు మరికొందరికి అవకాశం దక్కుతోంది. గడిచిన సీజన్లో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన సుమారు 1400మంది రైతులు నకిలీ మిర్చి విత్తనాల కారణంగా దగా పడ్డారు. వీరికి ఇప్పటికీ న్యాయం జరగకపోగా.. యాసంగికి రైతులు సిద్ధమవుతున్న సమయంలో గత ఏడాది డిసెంబర్ 17న నర్సంపేటలోని ఎంజేఆర్ రైస్మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 675బస్తాల వరి విత్తనాలు వ్యవసాయ శాఖ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ఊరుపేరు లేని విత్తనాలు తెచ్చినట్లు తేలినా కేవలం పోలీసులకు అప్పగించి చేతులు దులుపుక్ను వ్యవసాయ అధికారులు మళ్లీ దృష్టి పెట్టకపోవడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఏ కంపెనీవో..
నర్సంపేట ఎంజేఆర్ మిల్లులో 675బస్తాల వరి విత్తనాలు నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ అధికారులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పరిశీలనలో బస్తాలపై లేబుళ్లు, ట్యాగ్స్ లేకపోగా.. విత్తనాలకు సంబంధించిన అనుమతులు సైతం లేనట్లు తేలింది. విత్తనాల వివరాలు లేకపోవడంతో అవి సరైనవే అయినా రైతులకు నష్టం జరిగితే ఎవరిది బాధ్యత అనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల నిల్వలను పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఇలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవరమైతే పీడీ చట్టం కింద కేసులు పెడతామని జిల్లా వ్యవసాయ అధికారి ఉష స్పష్టం చేశారు. కానీ బాధ్యులపై సాధారణ కేసు పెట్టి విచారణను ఇప్పటి వరకు సాగదీస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. రైతులను మోసం చేసేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరికొందరు ఇలాగే వ్యవహరించే అవకాశముంది. అయినా అధికారులు ఈ దిశగా దృష్టి సారించకపోవడం గమనార్హం.
సా...గుతున్న విచారణ
Published Fri, Mar 3 2017 10:46 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement