నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడి అరెస్ట్

Published Sat, Aug 29 2015 2:55 PM

నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడి అరెస్ట్ - Sakshi

నరసాపురం(ప.గో):ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ ను పోలీసులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బంద్ లో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోపక్క తూర్పుగోదావరి జిల్లాలో కూడా వైఎస్సార్ సీపీ నేతల అక్రమ అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే,  వైఎస్సార్ సీపీ నేత పెండెం దొరబాబును అరెస్ట్ చేశారు.

దీంతో పాటు బంద్ లో పాల్గొన్న 40 మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. వామపక్షాలతో కలిసి మున్సిపల్ కార్యాలయం, కలెక్టరేట్ ముట్టడించి నగరంలో భారీ బైక్ ర్యాలీ చేశారు. బైక్ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు.

Advertisement
Advertisement