న్యాయం చేయాలంటూ స్కూలు ముందు ఆందోళనకు దిగిన మహిళ
మద్దతు పలికిన మహిళా సంఘాలు
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మందస: బాలిగాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ముందు బత్తుల సంధ్యారాణి అనే మ హిళ బుధవారం బైఠాయించారు. తన భర్త తనకు న్యాయం చేయడం లేదంటూ మహిళా సంఘాల మద్దతుతో ఆమె స్కూలు ముందు ఆందోళనకు దిగారు. వేరే మహిళ తో సంబంధం పెట్టుకుని తన భర్త తనను, పిల్లల్ని పట్టించుకోవడం లేదని ఆమె తెలి పారు. ఆమె తెలిసిన వివరాల మేరకు... మం దస మండలం బైరిసారంగపురం గ్రామానికి చెందిన బత్తుల మురళీమోహన్తో సంధ్యారాణికి 2004లో వివాహం జరిగింది. ఈ దం పతులకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
అ యితే రెండేళ్లుగా మురళీమోహన్ భార్యతో సరిగా ప్రవర్తించడం లేదు. తన భర్త ఇంటికి రావడం లేదని, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని సంధ్యారాణి తెలిపారు. భ ర్త తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకుని డబారు గ్రా మంలో కాపురం పెట్టినట్లు తెలిసిందని ఆమె చెప్పారు. దీనిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ సమయంలో పెద్దల సమక్షంలో తనకు న్యాయం చేసేందుకు తన భర్త ఒప్పుకున్నారని ఆమె తెలిపారు.
కానీ తర్వాత ఆయన వైఖరిలో మళ్లీ మార్పులు వచ్చాయని, తనను, పిల్లలను ప ట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మ హిళా సంఘాల సాయంతో ఆయన పనిచేస్తున్న పాఠశాల ముందు ఆందోళనకు దిగానని చెప్పారు. స్కూలు నుంచి బయటకు రావాలని నినాదాలు చేసినా రాకపోవడంతో పో లీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఈ విషయమై సంధ్యారా ణి భర్త మురళీమోహన్ వద్ద ప్రస్తావించగా తన భార్య ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇదివరకే పెద్దల సమక్షంలో ఇచ్చిన తీర్పుకు ఆమె అంగీకరించిందని, తాను పెద్దలు చెప్పినట్లు న్యాయం చేయడానికి అంగీకరించానని, అనవసరంగా మళ్లీ రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు.
భర్త కోసం బైఠాయింపు
Published Thu, Jun 23 2016 8:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement