మిర్యాలగూడ : కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ కిషన్రావు సూచించారు. ఆదివారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన తహసీల్దార్ల సమావేశంలో ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. పుష్కర ఘాట్ల వద్ద కంట్రోల్ రూంలతో పాటువాడపల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్లో సెంట్రల్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఘాట్ల వద్ద మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధుల్లో ఉండాలని, కంట్రోల్ రూంలోనూ 11 మంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఘాట్ల వద్ద ప్రతి రెండు గంటలకు ఒక సారి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు. డ్రోన్, సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని తెలిపారు. ఘాట్ల నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయన్నారు. అన్నదానం చేయాలనుకున్న వారు కేవలం పులిహోర ప్యాకెట్లు మాత్రమే పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఘాట్ల వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా చూడాలని, కరెంట్ పోతే వెంటనే జనరేటర్లు వేయాలని సూచించారు. ప్రమాదాలకు తావు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. వీఐపీల కోసం వాడపల్లిలోని శివాలయం, నాగార్జునసాగర్లోని శివాలయం, మట్టపల్లిలోని ప్రహ్లాదఘాట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిర్యాలగూడలో సోమవారం నుంచి కంట్రోల్ రూమ్ (ఫోన్ నెం. 08689–242890) పని చేస్తుందని చెప్పారు. సమావేశంలో తహసీల్దార్లు సత్యనారాయణ, గణేష్, పాండు, యదగిరి తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
Published Mon, Aug 1 2016 12:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement