⇒వైఎస్ పాలనలో అభివృద్ధి
⇒వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. గడచిన మూడేళ్లలో విశాఖతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిపై ఆయన దృష్టి సారించడం లేదన్నారు. సోమవారం వీజేఎఫ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మునుపటి మాదిరిగానే చంద్రబాబు అభివృద్ధినంతటినీ రాజధాని ప్రాంతంలోనే కేంద్రీకరిస్తున్నారన్నారు.
దీనివల్ల భవిష్యత్లో ప్రమాద ఘంటికలు మోగుతాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అయినా ముఖ్యమంత్రి వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయమని చెప్పారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనతో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్కు ధీటైన నగరంగా విశాఖకు పునాది వేశారన్నారు. విశాఖలో సత్యం, విప్రో వంటి సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాజధానికి అవసరమైన అన్ని హంగులూ, వనరులూ విశాఖకు ఉన్నాయని, ఇక్కడ ప్రజలు శాంతి కాముకులని కొనియాడారు.
ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వాల్సిందే..
రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విశాఖకు రైల్వే జోన్ ఇచ్చి తీరాలన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశారని, రైల్వే జోన్ కోసం పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గత ఏడాది అమరణ నిరాహారదీక్ష, ఇటీవల ఆత్మగౌరవయాత్ర పేరిట పాదయాత్రతో పాటు పార్టీ నాయకులు ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. రైల్వే జోన్ ఏర్పాటుపై రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. జోన్పై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చే వరకూ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈవీఎంలపై తమ పార్టీకి నమ్మకం ఉందని అంబటి చెప్పారు.
ఓడిపోయిన వారు ఓటమిని అంగీకరించకుండా నెపాన్ని ఈవీఎంలపైకి నెట్టేయడం రివాజుగా మారిందన్నారు. ఈవీఎంల నుంచి స్లిప్లు తీసుకునే విధానం మంచిదేనని అభిప్రాయపడ్డారు. మీట్ ది ప్రెస్లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు, సంయుక్త కార్యదర్శి దాడి రవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నాయకులు తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బాబు హయాంలో ఉత్తరాంధ్రకు అన్యాయం
Published Tue, Apr 18 2017 2:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement