నా భర్త ఆచూకీ తెలపండి | Sakshi
Sakshi News home page

నా భర్త ఆచూకీ తెలపండి

Published Sat, May 4 2019 2:40 PM

Woman Requesting Husbands Address - Sakshi

రాజంపేట రూరల్‌:  నా భర్త షేక్‌ షఫీ ఆచూకీ తెలపాలంటూ పట్టణానికి చెందిన షేక్‌ అప్సర పోలీసులను వేడుకొంది. పట్టణంలోని బంధువుల గృహంలో శుక్రవారం ఆమె విలేకర్లకు తన బాధ వెల్లడించిది. వీరబల్లి మండలం ఓదివీడు కస్పాకు చెందిన తన తండ్రి షేక్‌ యూసఫ్‌ రాజంపేట పట్టణం జెండా మాను వీధికి చెందిన మహబూబ్‌బాషా అలియాస్‌ నరసింహా కుమారుడు షఫీతో 2016 జూలై  7వ తేదీన ఓదివీడులోని తమ గృహము వద్ద నిఖ్కా జరిపించారని తెలియజేసింది. వివాహ సమయంలో దాదాపు 30 తులాల బంగారం కట్నం కింద అందజేశామంది.  వివాహమైన మూడు నెలలకు తను కువైట్‌కు  పంపించి, ఆ తరువాత ఒక నెలకు  భర్త కూడా కువైట్‌కు వచ్చాడని చెప్పింది. 2018 జూలై 1వ తేదీన ఇద్దరం అక్కడి నుంచి తిరిగి వచ్చామని తెలిపింది. 

అనంతరం తన భర్త ఇక్కడే ఉండగా నేను తిరిగి కువైట్‌కు వెళ్లి  అక్కడ నుంచి 2019 ఫిబ్రవరిలో రాజంపేటకు వచ్చాను. నా భర్త ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన అయిషాను కూడా వివాహం చేసుకుంటానని తెలపడంతో వ్యతిరేకించానని పేర్కొంది. అదే సమంయంలో మార్చి 1వ తేదీ సాయంత్రం నా భర్త చెల్లెలు షకీలా భాను నాతో ఘర్షణ పడి ఇంటిలో నుంచి పంపివేయాలని నా భర్తకు చెప్పిందని తెలియజేసింది. ఆ రోజు రాత్రి నా భర్త ఇక్కడ నుంచి వెళ్లి పోయాడని వాపోయింది. అదే రోజు రాత్రి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.  అప్పటి నుంచి పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నాని వాపోయింది. తన భర్త పొద్దుటూరులో ఉన్నట్లు సమాచారం ఉందని, మమ్మల్ని వారు రానీయటం లేదని, నా భర్త లేని జీవితం నాకు వద్దు అని విలపించింది. పోలీసులు నా భర్త ఆచూకీ తెలిపి ఆదుకోవాలని వేడుకుంది.

Advertisement
Advertisement