బస్సు, బైక్‌ ఢీ: ఇద్దరు మెడికోలు దుర్మరణం | Sakshi
Sakshi News home page

బస్సు, బైక్‌ ఢీ: ఇద్దరు మెడికోలు దుర్మరణం

Published Wed, Oct 25 2017 7:11 PM

 Two medicos died in Road accident in Kanchipuram - Sakshi

సాక్షి, కాంచీపురం: బస్సును బైక్‌ ఢీకొన్న రోడ్డుప్రమాదంలో ఇద్దరు మెడికోలు దుర్మరణం చెందారు. ఈ సంఘటన తమిళనాడలోని కాంచీపురం శివారులో చోటుచేసుకుంది. చెన్నై సిట్లపాక్కంకు చెందిన ప్రీతం, ఈరోడ్‌ పల్లిపాళయంకు చెందిన నితిన్‌ కార్తీక్‌లు కాంచీపురం సమీపంలోని చెట్టియార్‌పేట వద్ద ఉన్న మీనాక్షి వైద్య​ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతన్నారు. ఈ కాలేజీ బెంగళూరు- చెన్నై హైవేకు సమీపంలో ఉంటుంది.

వీరిద్దరూ కాంచీపురంలో అద్దెకు గది తీసుకుని ఉంటున్నారు. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం బైక్‌పై కాలేజీకి బయలుదేరారు. చెట్టియార్‌పేట సమీపంలో రోడ్డు పక్కన ఓ ప్రైవేట్‌ బస్సు ఆగి ఉంది. వేగంగా వస్తున్న వీరి బైక్‌ ఆకస్మాత్తుగా అదుపు తప్పి బస్సు వెనుక ఢీకొంది. దీంతో ప్రీతం, కార్తీక్‌లు దూరంగా ఎగిరిపడి సంఘటనా స్థలంలోనే ప్రణాలు కోల్పోయారు. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కాంచీపురం గవర్నమెంట్‌ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement