బెదిరించి.. మైనర్ బాలికపై అత్యాచారం
కర్నూలు : కర్నూలులోని రామలింగేశ్వరనగర్లో దారుణం చోటుచేసుకుంది. 14ఏళ్ల మైనర్ బాలికపై శివరామిరెడ్డి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంట్లో పని చేస్తున్న మైనర్ బాలికను బెదిరించి గత కొంతకాలంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.
నిందితుడు శివరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మైనర్ బాలికను పనిలోపెట్టుకోవడమే కాకుండా, అఘాయిత్యానికి పాల్పడటంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు