సాక్షి, అనకాపల్లిటౌన్(విశాఖపట్టణం) : పాత కక్షల కారణంగా స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి ఆనుకుని ఉన్న రామునాయుడుకాలనీలో బుధవారం అర్ధరాత్రి ఓ ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. పంచదార్ల మురళీ అలియాస్ దొడ్డి మురళీ(23)ని అదే ప్రాంతానికి చెందిన రవి, గణేష్లు మారణాయుధాలతో తలపై కొట్టారు. రక్తపు మడుగులో ఉన్న మురళీని పోలీసుల సాయంతో స్థానికులు పక్కనే గల ఎన్టీఆర్ వైద్యాలయంలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గతంలో మురళీ అదే ప్రాంతంలో నివాసముండేవాడు. ఇతనికి వివాహం కాలేదు. ముగ్గురు అన్నదమ్ములు. వారిలో ఆఖరివాడు మురళీ. ఇద్దరు అన్నయ్యలకు వివాహాలు జరిగాయి. ఇతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.ఇటీవల కొత్తూరు నర్సింగరావు పేటకు మకాం మార్చాడు. వివాహం కాకపోవడంతో తల్లి సన్యాసమ్మతో కలిసి జీవిస్తున్నాడు. చోడవరం వంటి ప్రాంతాలకు ఆటోలో పండ్లను సరఫరా చేస్తుంటాడు.
రామునాయుడుకాలనీ పక్కనే ఉన్న పండ్ల మార్కెట్లో బుధవారం రాత్రి పండ్లను లోడింగ్ చేస్తుండగా విషయం తెలుసుకున్న రవి, గణేష్లు అతనిపై మారణాయుధాలతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మురళీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ తాతారావు రంగప్రవేశం చేసి ఎన్టీఆర్ వైద్యాలయంలో చేర్పించారు. గణేష్, రవి.. మురళీల మధ్య పాతకక్షలు ఉన్నాయి. మృతునిపై పట్టణ పోలీస్స్టేషన్లో తొమ్మిది కేసులు ఉన్నాయి. నిందితులు రవి, గణేష్లపై కూడా నాలుగు కేసులున్నాయి.డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాత కక్షలతో ఆటో డ్రైవర్ హత్య
Published Fri, Jun 28 2019 1:06 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement