ఎంత పనిచేశావ్ దేవుడా!
తుమకూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం తుమకూరు జిల్లా కుణిగల్ జాతీయ రహదారి వద్ద జరిగింది. బెంగళూరు సంజీవనగర్లో నివాసం ఉంటున్న తమిళనాడుకు చెందిన నిర్మల (45), కుప్పు (46), పాంజాలి, వీరమ్మ, సెల్వీ, గోవిందమణి, నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైర్ పేలిపోవడంతో ఈ ఘోరం జరిగింది.
మరిన్ని వార్తలు