మార్కెట్లో నమో హవా : కొనసాగుతున్న జోరు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు స్థిరంగా లాభాలతో ప్రారంభమైనాయి. నాలుగు వందలకుపైగా లాభాలతో సెన్సెక్స్ ట్రేడింగ్ను ఆరంభించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 306 పాయింట్ల లాభంతో 39118, నిఫ్టీ 88 పాయింట్లు ఎగిసి11745 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ జోరు కొనసాగుతోంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లతో పాటు, ఆయిల్ రంగ, ఆటో షేర్లు లాభపడుతున్నాయి.
అటు డాలరు మారకంలో రుపీ పాజిటివ్గా ట్రేడింగ్ను ఆరంభించింది. డాలర్ పోలిస్తే 27పైసలు లాభపడి 69.75వద్ద రుపీ కొనసాగుతోంది. నిన్న (గురువారం) 36 పైసలు క్షీణించి 70.02 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు