వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి | Sakshi
Sakshi News home page

వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి

Published Sun, Jan 25 2015 7:20 PM

ysrcp activists attacked by tdp

అనంతపురం: తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దౌర్జన్యానికి దిగారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎంపీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నేత ముసలన్నపై దాడి చేశారు.

ఆ సమయంలోనే పోలీసులు కల్పించుకోవటంతో గొడవ కాస్త సద్దుమనిగింది. టీడీపీ దాడికి నిరసనగా వైఎస్సార్సీపీ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా టీడీపీ దాడులు మానుకోవాలని లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.

Advertisement
Advertisement