వైఎస్ జగన్‌కు విద్యార్థుల ఘనస్వాగతం | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌కు విద్యార్థుల ఘనస్వాగతం

Published Sat, Feb 13 2016 12:33 PM

వైఎస్ జగన్‌కు విద్యార్థుల ఘనస్వాగతం - Sakshi

ఆమదాలవలస: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన శనివారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటలకు ఆమదాలవలకు చేరుకున్న వైఎస్ జగన్‌కు విద్యార్థులు అధిక సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. తమ సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరుతూ తొలగింపునకు గురైన దస్తావేజు లేఖరులు ఇచ్చిన వినతిపత్రాన్ని స్వీకరించారు. అనంతరం వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం ఇంట్లో ధర్మాన ప్రసాదరావు తదితరులతో సమావేశం అయ్యారు. పార్టీ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి జగన్ బయల్దేరి సరుబుజ్జిలి జంక్షన్‌కు చేరుకున్నారు. 
 
రణస్థలం మండలంలోని పైడి భీమవరం, పత్తివాడపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను వైఎస్ జగన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలకు జనం అధిక సంఖ్యలో తరలిరావడంతో గ్రామాల్లోని వీధులన్నీ కిటకిటలాడిపోయాయి. . 

Advertisement

తప్పక చదవండి

Advertisement