♦ మతాంతర వివాహం చేసుకున్న యువతీయువకుడు
♦ యువకుడిపై దాడి చేసిన యువతి తల్లిదండ్రులు
♦ పోలీస్స్టేషన్కు చేరిన పంచాయతీ
పోరుమామిళ్ల: రెండు మతాలకు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రేమికులు వాట్సప్ ప్రేమతో ఒక్కటయ్యారు. వాట్సప్ ద్వారా జరిగిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. గురువారం సాయంత్రం అమ్మాయి తల్లిదండ్రులు వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లకు వచ్చి అబ్బాయిపై దాడి చేసి కొట్టడంతో ఈ ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పోరుమామిళ్లలో మోటార్ మెకానిక్గా పనిచేస్తున్న మహబూబ్ సుబహాన్ (22)కు హైదరాబాద్లో క్రియేటివ్ డిజైనర్గా పనిచేస్తున్న హర్షశ్రీ (19) అలియాస్ ఆయేషాతో వాట్సప్లో పరిచయమైంది. ఏడాది క్రితం మొదలైన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది.
వీరిద్దరు జూలై 24న కడప శివాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు సుబహాన్ను బెదిరించారు. దీంతో మిత్రులు, బంధువుల సలహాతో ఆ అమ్మాయిని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపాడు. అయితే హర్షశ్రీ అతని ప్రేమను మర్చిపోలేక నెల క్రితం పోరుమామిళ్ల వచ్చింది. ‘నీతోనే ఉంటాను, నాకు నా తల్లిదండ్రులు అవసరం లేదని’ స్పష్టం చేయడంతో సుబహాన్ ముస్లిం సంప్రదాయం ప్రకారం గత నెల ఆగస్టు 5న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంతో హర్షశ్రీ మహబూబున్నీషాగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం యువతి తల్లిదండ్రులు రవిగౌడ్, రాణి, తమ్ముడు విశ్వతేజగౌడ్లు పోరుమామిళ్ల వచ్చి మోటార్షెడ్లో పని చేసుకుంటున్న సుబహాన్పై దాడి చేశారు.
ఈ గొడవతో జనం పోగయ్యారు. సమాచారం పోలీసులకు తెలియడంతో వారిని స్టేషన్కు తీసుకెళ్లారు. రవిగౌడ్ హైదరాబాద్లో కాంట్రాక్టర్. కుమార్తె మతాంతర వివాహం చేసుకోవడం సహించలేకనే దాడికి పాల్పడినట్లు తెలిసింది. గురువారం సీఐ, ఎస్సై ఊర్లో లేకపోవడంతో వారి సమస్యకు పరిష్కారం లభించలేదు. కాగా అమ్మాయి తాను ఇష్టపూర్వకంగానే సుబహాన్ను వివాహం చేసుకున్నానని, తనకు తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం లేదని, అతనితోనే జీవిస్తానని తేల్చిచెబుతోంది. ఇదే విషయం సీఐ, ఎస్సైకి చెబుతానంటోంది.
ఆంధ్రా అబ్బాయి.. తెలంగాణ అమ్మాయి
Published Fri, Sep 1 2017 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement