సాక్షి, కాకినాడ :జిల్లాలో గతంలో ఎన్నడూ లేని సంకుచిత సంస్కృతికి అధికార తెలుగుదేశం ప్రజాప్రతినిధులు నేతలు బీజం వేస్తున్నారు. ప్రభుత్వాధికారుల బదిలీల్లో కులానికి పెద్ద పీట వేస్తున్నారు. తమ ఇలాకాలో పని చేసే అధికారులు తమ కులం వాళ్లే కావాలంటున్న వారి దుగ్ధ ఓ దుష్ట సంప్రదాయానికి నాంది పలుకుతోంది. వారిని పీడిస్తున్న ప్రమాదకరమైన కులజాడ్యానికి అద్దం పడుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులను తమ నియోజకవర్గాల్లోకి తెచ్చుకోవాలనుకోవడం పరిపాటే. అయితే నిజంగా ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధి ఎవరైనా.. తన నియోజకవర్గ పరిధిలో పని చేసే అధికారులు జనసేవాతత్పరులై ఉండాలని, నీతినిజాయితీలతో పని చేయాలని కోరుకోవాలి.
ఎవరైనా బదిలీపై వస్తుంటే.. అంతకు ముందు పని చేసిన చోట ఎలాంటి పేరుంది, కష్టించి పని చేస్తారా, లేదా, అక్కడి ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని మన్నిస్తారా, లేదా అనే వాటిపై ఆరా తీయాలి. కానీ పదేళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బదిలీలకు సంబంధించి ఒకవైపు బహిరంగంగానే ‘పోస్టుకు ఇంత’ అని రేటు నిర్ణయించి, సొమ్ము చేసుకుంటూనే మరోవైపు స్వీయ కులానికి అగ్రతాంబూలమిస్తుండడం నివ్వెరపరుస్తోంది. ‘వచ్చే అధికారి ఎంత అవినీతిపరుడైనా ఫర్వాలేదు. నా కులపోడై ఉండాలి. నేను చెప్పిందానికల్లా తలూపాలి’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎస్సైల నుంచి తహశీల్దార్, ఎంపీడీఓల వరకూ ప్రతి శాఖలో, ప్రతి పోస్టులో తమ కులస్థులకే పెద్దపీట వేస్తూ సిఫార్సు లేఖలు ఇస్తున్నారు.
సమర్థులు కాదు..
అస్మదీయులు ముఖ్యం
ఈ కుల జాడ్యం ఆ ప్రాంతం, ఈ ప్రాంతమనే తేడా లేకుండా ఇంచుమించుగా అధికార పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల న్నింటా కనిపిస్తోంది. ఉదాహరణకు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ నియోజకవర్గంలో ఎస్సైల నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకూ కీలకమైన ప్రతి పోస్టులో తమ సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యమివ్వాలని అక్కడి ప్రజాప్రతినిధి పట్టుబడుతున్నారు. సమర్థులైనా వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి కనీసం సిఫార్సు లేఖలు ఇచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్షానికి మెజార్టీ ఓట్లు వేశారని భావిస్తున్న సామాజిక వర్గాలకు చెందిన అధికారులను రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల అక్కడి ప్రజాప్రతినిధుల సామాజిక వర్గీయులెవరికీ పోస్టింగ్లు ఇవ్వడానికి వీల్లేదంటూ ఆ నియోజకవర్గాల టీడీపీ నేతలు పార్టీ అధినాయకుల వద్ద పట్టుబడుతున్నారు.
అనారోగ్యకరమైన సంకేతం
అయితే కోనసీమలో ఇందుకు భిన్నంగా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు ఒక రిజర్వుడు నియోజకవర్గంలో కీలక పోస్టుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారులను సిఫార్సు చేసేందుకు అక్కడి ప్రజాప్రతినిధి ఆసక్తి చూపడం లేదు. అక్కడ ఎస్సీ సామాజిక వర్గీయులు గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మొగ్గు చూపడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కీలక పోస్టుల్లో ఉండి, కులాభిమానం చూపిస్తే రాజకీయంగా తమకు ఇబ్బందికరంగా మారుతుందనే ధోరణి ఆ ప్రజాప్రతినిధిలో కనిపిస్తోంది.
మొత్తం మీద జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనారోగ్యకర ధోరణిని ఆసరాగా కొందరు అవినీతి అధికారులు కులాన్ని సాధనంగా ఉపయోగించి కీలకమైన పోస్టులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ నేతలతో చుట్టరికాలు కలుపుతూ కీలక పోస్టుల్లో పాగా వేయాలని చూస్తున్నారు. కులాన్ని బలహీనపరచడానికీ, అన్ని కులాల నడుమా అనుబంధాన్ని పెంపొందించడానికీ కృషి చేయాల్సిన బాధ్యత తక్కిన వారిపై కన్నా.. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి, పదవిని చేపట్టిన ప్రజా ప్రతినిధులపై ఉంది. అయితే.. వారే మామూలు మనుషుల కన్నా దిగజారి, సొంత కులమే ముఖ్యమన్నట్టు వ్యవహరించడం తాత్కాలికంగా వారికి ప్రయోజనకరమైనా చివరికి సమాజానికి అనారోగ్యకరమైన సంకేతమే.
మా ఇలాకాలో..మావాళ్లే..
Published Mon, Sep 22 2014 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement