ఆర్టీసీకి స్పెయిన్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతిపాదన
బస్సులు, సిబ్బంది సేవల గరిష్ట వినియోగానికి ప్రత్యేక సాఫ్ట్వేర్
ఆర్టీసీ ఎండీతో కంపెనీ ప్రతినిధుల భేటీ
ప్రయోగాత్మకంగా ఓ రూటు అప్పగించేందుకు అంగీకారం
సాక్షి, హైదరాబాద్: అదో సాఫ్ట్వేర్ తయారీ సంస్థ... అంతర్జాతీయంగా రవాణారంగంలో దాని ఉత్పత్తులకు మంచి పేరుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల రవాణా సంస్థగా గుర్తింపు పొంది గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీని ఇప్పుడు ఆశ్ర యించింది... తాను రూపొందించిన సాఫ్ట్వేర్ను వాడితే సంస్థ రాబడులు పెరుగుతాయని పేర్కొంది. సాధారణంగా ఇలాంటి సాఫ్ట్వేర్లను అమ్మినందుకు కంపెనీలు దాని ఖరీదును వసూలు చేసుకోవటం సహజం. కానీ, తన సాఫ్ట్వేర్ వాడటం వల్ల పెరిగిన రాబడిలో తనకు వాటా ఇమ్మని అడుగుతోంది.
ఇదీ సంగతి...
దాదాపు 22 వేల బస్సులను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రవాణా సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో లాభాలు పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఆధునిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంటోంది. ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంను ఏర్పాటు చేసుకునేందుకు ఇటీవల స్పెయిన్కు చెందిన ట్రైమాక్స్ అనే సంస్థ సాఫ్ట్వేర్ను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న గోల్ సిస్టమ్స్ అనే సంస్థ తాజాగా ఆర్టీసీని సంప్రదించింది.
వాహనాలను గరిష్ట స్థాయిలో వినియోగించటం, వాటి డ్రైవర్ల పనివేళలను సమర్థంగా వాడుకునేందుకు వీలుగా తాము ప్రత్యేక సాఫ్ట్వేర్లను రూపొందించామని, ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు వాటిని వాడుకుని రాబడులను పెంచుకున్నాయని, ఏపీఎస్ఆర్టీసీ కూడా దాన్ని వినియోగిస్తే రాబడులు భారీగా పెరుగుతాయని గట్టిగా పేర్కొంది. బుధవారం ఆ సంస్థ ప్రతినిధులు ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి తమ సాఫ్ట్వేర్ ప్రత్యేకతలను వివరించారు.
ఒక ప్రాంతం నుంచి వచ్చిన బస్సు తిరిగి మరో గమ్యస్థానానికి వెళ్లేప్పుడు దాని వినియోగం గరిష్ట స్థాయిలో ఉండాలంటే కొన్ని ప్రత్యేక మెళకువలు అనుసరించాలని, వాటి ఆధారంగానే సాఫ్ట్వేర్ను రూపొందించినట్టు వెల్లడించింది. ఒక ట్రిప్పునకు మరో ట్రిప్పునకు మధ్య ఖాళీగా ఉండే సమయాన్ని కుదించటంతోపాటు ఆ బస్సును వచ్చిన ప్రాంతానికి కాకుండా మరో ప్రాంతానికి పంపటం, మరో బస్సును ఇటువైపు తిప్పటం లాంటి వాటి ద్వారా బస్సు వృథాగా ఉండే సమయాన్ని తగ్గించటం లాంటి అంశాలు ఇందులో ఉంటాయని పేర్కొంది.
ఆర్టీసీలో ఓ మార్గాన్ని తమకు కేటాయిస్తే రాబడులు ఎలా పెరుగుతాయో ప్రయోగాత్మకంగా చేసి చూపనున్నట్టు తెలిపింది. దీంతో హైదరాబాద్లో ఓ రూట్ను దానికి కేటాయిస్తున్నట్టు ఎండీ పూర్ణచంద్రరావు తెలిపారు. ఆ మార్గంలో తమ సాఫ్ట్వేర్ ద్వారా రాబడులు పెంచి చూపుతామని, ప్రయోగానికి ఎలాంటి రుసుము తీసుకోమని పేర్కొంది. అయితే తమ సాఫ్ట్వేర్ను పూర్తిస్థాయిలో వినియోగిస్తే దాని వల్ల పెరిగిన రాబడిలోంచి వాటా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. కాగా, ఈ ప్రయోగం విజయవంతమైతే మిగతా రూట్లలో దాన్ని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు.
రాబడి పెంచుతాం.. వాటా ఇస్తారా?
Published Fri, Dec 19 2014 3:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement