అంచనాలు రూపొందించిన పెట్టుబడుల శాఖ
కోట్లాది రూపాయలు వృథా అవుతాయని ఆర్థిక శాఖ అభ్యంతరం
సీఎం చెంతకు చేరిన ఫైలు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు రెవెన్యూ లోటుతో ఇబ్బందులకు గురవుతున్న రాష్ట్రాన్నిదుబారా వ్యయం ఆర్థికంగా మరింత కుంగదీస్తోంది. తాత్కాలిక రాజధాని కోసం రూ. 150 కోట్ల అంచనాలతో మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ అంచనాలు రూపొందించింది. ఒకవైపురాజధాని నిర్మాణానికి, రైతుల రుణ మాఫీకి, ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి నిధుల్లేవంటూనే మరోవైపు వృథా వ్యయానికి సిద్ధపడడంపై ఐఏఎస్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు ఆఫీసుల హంగులకు రూ. 23 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి దుబారాకు మొగ్గు చూపుతుండటాన్ని వారు విమర్శిస్తున్నారు.
ఒక చదరపు అడుగుకు రూ. 2,200 వ్యయం అంచనాతో ఐదు లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక రాజధాని నిర్మాణానికి టెండర్ పిలిచిన విషయం తెలిసిందే. దీనికి 110 కోట్ల రూపాయల మేర వ్యయమవనుంది. ఇతర ఖర్చులకు మరో రూ. 40 కోట్ల మేర వ్యయం అవుతుందంటూ అంచనాలను రూపొందించారు. తాత్కాలిక రాజధానిలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ. 2,200 వ్యయమవుతుందని అంచనా వేశారు. అయితే శాశ్వత రాజధాని నిర్మాణం చేపడితే అప్పుడు తాత్కాలిక రాజధాని నిర్మాణాలు ఎందుకు పనికిరాకుండా పోతాయని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
శాశ్వత రాజధాని నిర్మాణానికి చదరపు అడుగుకు రూ. 2,600 రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాశ్వత రాజధాని నిర్మాణానికి, తాత్కాలిక రాజధాని నిర్మాణానికి వ్యయంలో కొద్ది శాతమే వ్యత్యాసం ఉన్నందున నిధులను దుర్వినియోగం చేసినట్లవుతుందని అభిప్రాయపడింది. తాత్కాలిక రాజధాని నిర్మాణం అంచనాలతో కూడిన ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపైనే తాత్కాలిక రాజధాని నిర్మాణం ఆధారపడి ఉంది.
ఇదిలా ఉండగా వచ్యే విద్యా సంవత్సరం నాటికి పలు శాఖల విభాగాలను గుంటూరు-విజయవాడలకు తరలించే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏయే శాఖలను తరలించాలి, అక్కడ వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనే దానిపై అంచనాకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను కూడా రూపొందించింది.
తాత్కాలిక రాజధాని పేరిట నిర్మాణాలు అవసరం లేదని, గుంటూరు, విజయవాడల్లో ఉన్న అనేక ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేట్ కళాశాలలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వినియోగించుకుంటే సరిపోతుందంటూ అధికారుల కమిటీ నివేదికను రూపొందించింది. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరిట కోట్లాది రూపాయలను నిధులు దుర్వినియోగం చేయడానికి మొగ్గు చూపుతుండటంతో అధికారులు బాహాటంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసేందుకు ఇష్టపడడం లేదు.
‘తాత్కాలిక’ దుబారా రూ. 150 కోట్లు
Published Sat, Mar 7 2015 8:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement