ఇళ్ల పట్టాలు ఇప్పించండయ్యా..
కృష్ణాజిల్లా : ‘అయ్యా.. మేమంతా కొండపావులూరి గ్రామంలో రెండు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నాం. అయితే మాకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు’ అంటూ కొండపావులూరి గ్రామానికి చెందిన జెట్టి సుశీల, కలపర్తి ఏసురత్నం, బాపట్ల వెంకటస్వామి తదితరులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పట్టాలు లేకపోవడం వల్ల తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా దుర్భర జీవనాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. పట్టాలిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లుగా తమను టీడీపీ నాయకులు మోసం చేశారని వాపోయారు. మనందరి ప్రభుత్వంలో తమకు న్యాయం చేయాలని వారు జననేతను కోరారు.
సంబంధిత వార్తలు