చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించండి | Sakshi
Sakshi News home page

చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించండి

Published Tue, Mar 20 2018 7:05 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు: యానాదులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలంటూ యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు యందేటి వెంకటసుబ్బయ్య వైఎస్‌ జగన్‌ను కోరారు. యానాదుల సంక్షేమ సంఘం సభ్యులు కాకుమానులో పర్యటిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. యానాదుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తమను ఆదుకోవాలని కోరారు. యానాదుల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. మన ప్రభుత్వం వస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. అనంతరం ఎస్టీకాలనీ మహిళలంతా ఓ చోటకు చేరడంతో జగన్‌మోహన్‌రెడ్డి వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.

Advertisement
Advertisement