ప్రాణం పోయినా పార్టీ మారను | Sakshi
Sakshi News home page

అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా..

Published Thu, Feb 22 2018 7:12 AM

people sharing their sorrows to ys jagan - Sakshi

కందుకూరు రూరల్‌: ‘తొమ్మిది నెలల క్రితం ఎన్‌టీఆర్‌ గృహం నిర్మించుకున్నా. అయితే బేస్‌మెంట్‌ బిల్లు 11వేల రూపాయిలు మాత్రమే వచ్చాయి. బిల్లులు వస్తాయని నమ్ముకుంటే.. ఇటు బిల్లు రాక... అటు అప్పు తీరక ఇబ్బందులు పడుతున్నాం. న్యాయం చేయాలని పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పేందుకు వచ్చా’ అంటూ నేలపాటి చిన్నమ్మి చెప్పింది.

ప్రాణం పోయినా పార్టీ మారను
పర్చూరు: వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసిన సమయంలో టీడీపీ చేసిన ఒత్తిడిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి రెండు ఆపరేషన్లు చేయించాను. రూ. 12 లక్షలు ఖర్చు అయింది. కాలు, చేతికి పక్షవాతం వచ్చాయి. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పెడదామంటే ఎమ్మెల్యే లెటర్‌ కావాలంటున్నారు. పార్టీ మారితే నీకు సహాయం చేస్తామని టీడీపీ నాయకులంటున్నారు. ప్రాణంపోయినా పార్టీ మారే ప్రసక్తి లేదు సార్‌’ అంటూ  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement