గాలివీడు: కుటుంబ కలహాలు తల్లీ, తనయుల మృతికి దారితీశాయి. తన కుమార్తెను అల్లుడి మొదటి భార్య నవనీత, అల్లుడి సోదరులు ఆదిరెడ్డి, తాతిరెడ్డి పథకం ప్రకారం హత్య చేసి బావిలో వేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. అయితే కుటుంబ కలహాల కారణంగానే తల్లీ, తనయులు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. మండలంలోని ప్యారంపల్లె పంచాయతీ మజ్జిగ వారిపల్లెకు చెందిన మజ్జిగ బయ్యారెడ్డి రెండవ భార్య పూజిత (30) ఆమె కుమారుడు భానుప్రసాద్రెడ్డి(6) గ్రామం సమీపంలోని వ్యవసాయ బావిలో శుక్రవారం ఉదయం శవాలై తేలారు. వీరిది హత్యా.. లేక ఆత్మహత్యా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
స్థానికుల వివరాల మేరకు.. మజ్జిగవారిపల్లెకు చెందిన బయ్యారెడ్డి అదే పంచాయతీ ఆవుల వాండ్లపల్లెకు చెందిన నవనీతను వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రియాంక (15) అనే కుమార్తె ఉంది. వారసులు లేరనే కారణంతో మొదటి భార్య నవనీతను ఒప్పించి అనంతపురం జిల్లా తలుపుల మండలం పులిగండ్ల వారి పల్లెకు చెందిన ప్రసాద్రెడ్డి కుమార్తె పూజితను బయ్యారెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి తనూష(8)అనే కుమార్తెతో పాటు భానుప్రసాద్రెడ్డి (6) అనే కుమారుడు కలిగారు.
అలాగే నవనీతకు కూడా బబ్లు (4) అనే కుమారుడు పుట్టాడు. బయ్యారెడ్డి అతని రెండవ భార్య పూజిత ఇద్దరూ బతుకు దెరువు కోసం ఐదేళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. దీంతో పూజిత పిల్లలు తనూష, భాను ప్రసాద్రెడ్డి అమ్మమ్మ వద్ద(ఎనుముల వారిపల్లె) పెరుగుతుండే వారు. ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చిన బయ్యారెడ్డి మళ్లీ నెలక్రితం గల్ఫ్కు వెళ్ళాడు. నాలుగు నెలల క్రితం పూజిత కూడా ఇంటికి వచ్చింది. మళ్లీ గల్ఫ్కు వెళ్లడానికి పూజిత ప్రయత్నించగా బయ్యారెడ్డి ఒప్పుకోలేదు. ఆమె పాస్పోర్టును చించేశాడు. ఈ నేపధ్యంలో జూలై 23వ తేదీన కుటుంబసభ్యులతో పూజిత గొడవ పడింది. పోలీస్స్టేషన్లో రాజీ అయ్యారు. బుధవారం నుంచి పూజిత ఆమె కుమారుడు భానుప్రకాష్రెడ్డి గ్రామంలో కనబడ లేదు. ఖాదర్ భాషా అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ బావిలో తల్లీ తనయుడు మరణించి ఉండటాన్ని శుక్రవారం గ్రామస్తులు గమనించారు.
సమాచారం తెలిసిన వెంటనే వీఆర్ఓ వెంకటనారాయణ, లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్ కుమార్రెడ్డి, గాలివీడు ఎస్ఐ రెడ్డి సురేష్, ఏఎస్ఐలు సుబ్బరాయుడు, రఘు రామయ్య బావి వద్దకు వెళ్లి తల్లీతనయుల శవాలను వెలికి తీయించారు. కాగా వీరి ముఖాలపై రక్త గాయాలుండడం, కళ్లు ఉబ్బిపోయి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కుమార్తెను, మనమడిని ఆమె బావ ఆదిరెడ్డి, మరిది తాతిరెడ్డి, అల్లుని మెదటి భార్య నవనీత పధకం ప్రకారం చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు కట్టు కథ అల్లుతున్నారని పూజిత తల్లి గంగులమ్మ, ఆమె సోదరుడు ప్రసాద్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తల్లీ, తనయుని హత్య..!
Published Sat, Aug 2 2014 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement